Botsa Satyanarayana: టీడీపీని చూసి ఎందుకు భయపడతాం.. మంత్రి బొత్స కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Gives Strong Counter To TDP Leaders: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోని చూసి వైసీపీ భయపడుతోందని టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము టీడీపీని చూసి ఎందుకు భయపడతాం? వాళ్లేమైనా పులులా, రాక్షసులా? అని ప్రశ్నించారు. టీడీపీ ఒక రాజకీయ పార్టీ అని, ఓ పార్టీగా మేనిఫెస్టోను విడుదల చేసిందని తెలిపారు. చంద్రబాబు గతంలో కూడా మేనిఫెస్టోని ప్రకటించారు కానీ, దాన్ని అమలు చేయకుండా మాయలు చేశారని ఆరోపించారు. అయినా.. టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా చెప్పదేమీ లేదని దుయ్యబట్టారు.
Delhi Murder Case: సాక్షి హత్య కేసులో సాహిల్ పట్టించిన ఫోన్ కాల్.. నేరం ఒప్పుకున్న నిందితుడు..
Also Read
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
వైసీపీ నాలుగేళ్ల పాలనని దిగ్విజయంగా పూర్తి చేసుకుందని.. భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తాము తూ.చ. తప్పకుండా పాటించామని మంత్రి బొత్స తెలిపారు. చెప్పింది చేశామని తాము గర్వంగా చెప్పగలమన్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనకుందని.. ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నామని అన్నారు. విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామని, విద్యార్థుల సంఖ్యను పెంచామని, జిల్లాకో మెడికల్ కాలేజీని పెట్టామని చెప్పారు. ఆరోగ్య శ్రీ సేవల సంఖ్యను సైతం పెంచామని.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనేది ప్రజలే చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. మా పరిపాలన బాగుంటే.. మమ్మల్ని గెలిపించండని సీఎం జగన్ ధైర్యంగా అడుగుతున్నారని పేర్కొన్నారు. గతంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ అనే విధానాన్ని ఆమోదించామన్నారు. పునాదుల నుంచే నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.
avitra lokesh: పవిత్రా లోకేష్ మనసులో మరో ఇద్దరు హీరోలు.. నరేష్ ఏమైపోతాడు..
ప్రాథమిక స్థాయిలోనే కాకుండా.. హైస్కూల్ స్థాయిలో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. త్వరలో డిజిటల్ క్లాసుల నిర్వహణకూ చర్చలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న కీ పర్సన్స్.. జిల్లాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏ కుటుంబమైనా.. ఏ రాష్ట్రమైనా అభివృద్ది చెందాలంటే విద్య చాలా అవసరమని సూచించారు. అందరూ గర్వించదగ్గ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉండాలనేదే సీఎం జగన్ ఆలోచన అని తెలియజేశారు. ఈ స్థాయిలో చేపట్టినన్ని విద్యా సంస్కరణలు.. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో చేపట్టలేదని ఉద్ఘాటించారు. బడ్జెట్లో 40 శాతం ఖర్చు విద్యకే కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పైసా.. ప్రతి రూపాయి మంచికి ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!