Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Botsa Satyanarayana Fire On Chandrababu Over Ap Debts

Botsa Satyanarayana: అప్పులపై ఈడీ విచారణ..? అసలు చంద్రబాబుకు బుద్ధి ఉందా?

Published Date :July 26, 2022 , 1:13 pm
By Ramesh Nalam
Botsa Satyanarayana: అప్పులపై ఈడీ విచారణ..? అసలు చంద్రబాబుకు బుద్ధి ఉందా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Botsa satyanarayana fire on chandrababu:
విజయవాడలో ఈఏపీసెట్-2022 ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా అర్ధం చేసుకుని మాట్లాడాలని బొత్స సూచించారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి మాట్లాడితే ఎలా అని నిలదీశారు. పుస్తకాల డిమాండ్ గురించి ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలను ముందే అడిగామన్నారు. అయితే వాళ్లు డిమాండ్‌లో 20 శాతం మాత్రమే చెప్పారన్నారు. ప్రభుత్వం కఠినంగా ఉందని అర్ధమైన తర్వాత ఇప్పుడు ఇంకా పుస్తకాలు కావాలని అడుగుతున్నారన్నారు.

వరద బాధితులకు సహాయం చంద్రబాబు మాటలు చూస్తే ప్రజలు నవ్విపోతారని మంత్రి బొత్స చురకలు అంటించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వరద సహాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నారు. ముంపు మండలాల విషయంలో చంద్రబాబు తెలంగాణకు మద్దతు ఇస్తున్నాడా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబుకు పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కాకుండా చూడాలనుకుంటున్నారని.. ప్రభుత్వం చేస్తున్న అప్పులు చీకట్లో చేస్తున్నవి కాదని.. తమ అప్పులపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని సూచించారు. ఈడీ విచారణ వేయమనటానికి చంద్రబాబుకు బుద్ధి ఉందా అని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోవటానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Also Read

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!
  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
Add as a preferred
source on google

Read Also: AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్

మరోవైపు పనిలో పనిగా మీడియాకు కూడా బొత్స క్లాస్ పీకారు. మీడియా కూడా వ్యవస్థలో భాగమని.. వ్యవస్థను బాగు చేయటానికి ప్రయత్నించాలని హితవు పలికారు. వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయటానికి ప్రయత్నం చేయవద్దన్నారు. తప్పులు ఉంటే చెప్పాలని.. తాము స్వాగతిస్తామన్నారు. అంతేకాని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. స్కూళ్ల విషయంలో కొన్ని సంఘాలే అడుగుతున్నాయంటే వాళ్ళకేం దుర్బుద్ధి ఉందో తనకేం తెలుసన్నారు. ఏ ఒక్క టీచరు లేదా ఉపాధ్యాయ సంఘాన్ని అయినా తన దగ్గరకు తీసుకువస్తే సమాధానం చెప్తానన్నారు. ప్రతి హైస్కూల్లోనూ ఒక హెడ్మాస్టర్, ఒక పీటీ టీచర్ ఉండాలని చెప్పిందే తాను అని బొత్స స్పష్టం చేశారు. ప్రతి స్కూల్‌లోనూ కచ్చితంగా ఇద్దరు టీచర్లు ఉండాలని తానే చెప్పానన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అడగలేదని.. అసలు విద్యా విధానమే తప్పంటే ఎలా అన్నారు. ఇంకా మెరుగైన విధానం ఉంటే ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap politics
  • botsa satyanarayana
  • chandrababu
  • YSRCP

తాజావార్తలు

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

  • MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions