Botsa Satyanarayana : చంద్రబాబు కేసుల ఉపసంహరణ చట్ట విరుద్ధం
- కోవిడ్ తర్వాత వైద్యం బలోపేతంపై జగన్ కృషి
- చంద్రబాబు కేసుల ఉపసంహరణపై బొత్స ఆగ్రహం
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు
- రైతాంగ సమస్యలు, పాలన వైఫల్యాలు గట్టిగా ఎత్తిచూపిన బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు.
అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి పిపిపి మోడల్ను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని బొత్స తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఎక్కడా విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణలో లేవని, ప్రజలకు ఈ సేవలను అందించడం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. గవర్నర్ అపాయింట్ మెంట్ లభించిన వెంటనే ఆ సంతకాలను సమర్పిస్తామని ప్రకటించారు.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
తమపై ఉన్న కేసులను సుమోటోగా ఉపసంహరించుకున్న చరిత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేదని బొత్స అన్నారు. నిజాయితీ పరుడైతే న్యాయస్థానాల నుంచి నిర్దోషిగా నిరూపించుకోవాలని, కానీ చట్టాల్లో లొసుగులు చూసుకుని కేసులు తీసేయించుకోవడం సరైంది కాదని విమర్శించారు. దీనిపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసులకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకాలున్నాయనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు ఉపసంహరించుకున్న ఏకైక సీఎం చంద్రబాబు అని ఆరోపించారు.
ఇటీవల తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం కొనుగోలు వేగంగా జరగడం లేదని బొత్స దుయ్యబట్టారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా పంటలకు గిట్టుబాటు ధరలు ఉండవని, రైతుల వద్ద కొనుగోలు శక్తి తగ్గిపోయి జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోయాయని అన్నారు.
HMD XploraOne: పిల్లల కోసం మొదటి స్మార్ట్ఫోన్.. HMD XploraOne వచ్చేస్తోంది..
ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం, ఎరువులు సమకూర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఈ సీజన్లో కూడా ఎరువుల కొరత తప్పదనే పరిస్థితి కనిపిస్తోందని హెచ్చరించారు.
గత 18 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గత అయిదేళ్లలో జరిగిన నేరాల కంటే ఎక్కువ నేరాలు ఈ కాలంలోనే నమోదయ్యాయని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అట్టడుగున ఉందని, అప్పుల్లో అగ్రస్థానంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో ఒత్తిళ్లు, ప్రలోభాలే కారణమని, మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైందని అన్నారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుచుకున్న స్థానాలేంటని ప్రశ్నించిన ఆయన, “పవన్ 15 ఏళ్లు కలిసి ఉండాలని కోరుకుంటే సరిపోదు, ప్రజలు కోరుకోవాలి” అన్నారు. ఈ ప్రభుత్వానికి 15 ఏళ్లు కాదు, 15 నెలలు కూడా అధికారంలో కొనసాగేందుకు హక్కు లేదని మండిపడ్డారు. వ్యవసాయం “దండగ” అని నమ్మే చంద్రబాబు నుంచి రైతులకు మేలు జరగదని బొత్స వ్యాఖ్యానించారు. సూట్బూట్ వేసుకున్న ధనవంతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆరోపించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ రైతులకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు.
Akhanda 2 : అఖండ 2 టిక్కెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ ఓకే.. ఎంత పెంచారంటే !
తాజావార్తలు
-
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
-
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
-
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
-
Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
-
Main Wapas Aaunga: హైదరాబాద్ థియేటర్లలో ‘మైన్ వాపస్ ఆవుంగా’ డైరెక్టర్
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!