GVL Narasimha Rao: ఏపీ గవర్నర్కు జీవీఎల్ లేఖ.. విశాఖ భూములపై సిట్ రిపోర్టును బహిర్గతం చేయండి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: విశాఖ భూముల విషయంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైసీపీ నుంచి సంతృప్తికర సమాధానం రావటం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడికి న్యాయం జరగకుండా సంపన్నులకు న్యాయం చేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ ఎవరు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారని.. ఇదే అమర్నాథ్ గతంలో ఈ అంశంపై సీబీఐ విచారణ కావాలని అడిగింది నిజమా.. కాదా అని ప్రశ్నించారు. విశాఖ భూములను రాజకీయ పార్టీలు అడ్డగోలుగా దోచుకున్నాయని జీవీఎల్ ఆరోపించారు. 42 వేల కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు ప్రజల కళ్లు గప్పే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు చేశారు.
Read Also: CM KCR Delhi Visit: బీఆర్ఎస్ ప్రకటన తర్వాత తొలిసారి హస్తినకు కేసీఆర్.. ఏం జరగబోతోంది..?
Also Read
అటు విశాఖ భూముల వ్యవహారంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. గతంలో సిట్తో విచారణ జరిపారని.. ఇప్పటివరకు రిపోర్ట్ రాలేదని లేఖలో ఆయన గుర్తుచేశారు. ఈ అంశంపై రెండు సార్లు సిట్ విచారణ జరిగినా రిపోర్టులను తొక్కి పెట్టారని జీవీఎల్ ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని సిట్ రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులను సెక్షన్ 22 ఏలో పెట్టి వేధిస్తున్నారని.. వైసీపీ ప్రజాద్రోహ చర్యలు చేస్తోందని మండిపడ్డారు. బడాబాబుల భూములను సెక్షన్ 22 ఏ నుంచి తప్పిస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!