Bhumana Karunakar Reddy: ఆనాటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న మరోసారి హౌస్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు.
పెగాసస్ వ్యవహారంపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సభ ముందు పెడతామని భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం డేటా చౌర్యం విషయంలో అనేక దొంగ పనులు చేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పామన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన అంశాలు కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిందని భూమన విమర్శలు చేశారు. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. కమిటీ కేవలం పెగాసస్ అంశానికి మాత్రమే పరిమితం కాదని.. అవసరమైతే అప్పుడు నిఘా విభాగంలో పని చేసిన అధికారులను పిలిపిస్తామని తెలిపారు. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారని శాసన సభ నమ్మిందని.. కమిటీ కూడా ఈ అంశాన్ని నమ్ముతోందని భూమన అన్నారు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!