Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
- తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం
- ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోన్న పెద్దపులి సంచారం
- మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. పోలవరం జిల్లాలో సంచరించిన బెంగాల్ టైగర్ తాజాగా రూటు మార్చుకుని.. తూర్పుగోదావరి జిల్లాలోకి మళ్లీ ప్రవేశించింది. కోరుకొండ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి కనిపించినట్లు అధికారులు గుర్తించారు. పెద్దపులి మెడకు అమర్చిన ట్రాకింగ్ కాలర్ ద్వారా దాని కదలికలను అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి వరకు పోలవరం జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం కొండపై సంచరించిన ఈ పెద్దపులి, తాజాగా కోరుకొండ మండలంలోకి చేరింది. దీంతో రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
పెద్దపులి జనావాసాల సమీపంలో సంచరిస్తుండటంతో కోరుకొండ, కాపవరం, కోటి కేశవరం, శ్రీరంగపట్నం, మునగాల తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పాండవుల మెట్ట ప్రాంతాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు ప్రజలు రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..