Bhumana Karunakar Reddy: ‘సీమ’లోనూ మూడు రాజధానుల ఉద్యమం.. 29న తిరుపతిలో ‘ఆత్మగౌరవ’ ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్రెడ్డి సర్కార్.. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే కాదు.. ఈనెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సిద్ధమైంది.. దీనిపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..
Also Read
ఈనెల 29వ తేదీన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు భూమన కరుణాకర్ రెడ్డి.. రాయలసీమ గొంతును మహా ప్రదర్శన ద్వారా చాటిచేబుదాం అంటూ పిలుపునిచ్చారు.. రాయలసీమకు న్యాయ రాజధాని కావాలి… అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకపడ్డాయి.. అందుకే సీఎం వైఎస్ జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.. సీఎం జగన్ తీసుకున్న మంచి నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.. ఇక, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా ధనిక రైతులు పాదయాత్ర కొనసాగుతోందని విమర్శించిన భూమన.. చంద్రబాబు నిర్ణయాలు రాయలసీమ వాసులను క్షోభకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు.. వైఎస్సార్ సీఎం అయ్యే వరకు రాయలసీమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన.. రాయలసీమకు ఇప్పటికీ తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నాడని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!