Bhumana Karunakar Reddy: ‘సీమ’లోనూ మూడు రాజధానుల ఉద్యమం.. 29న తిరుపతిలో ‘ఆత్మగౌరవ’ ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్రెడ్డి సర్కార్.. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే కాదు.. ఈనెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సిద్ధమైంది.. దీనిపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
ఈనెల 29వ తేదీన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు భూమన కరుణాకర్ రెడ్డి.. రాయలసీమ గొంతును మహా ప్రదర్శన ద్వారా చాటిచేబుదాం అంటూ పిలుపునిచ్చారు.. రాయలసీమకు న్యాయ రాజధాని కావాలి… అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకపడ్డాయి.. అందుకే సీఎం వైఎస్ జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.. సీఎం జగన్ తీసుకున్న మంచి నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.. ఇక, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా ధనిక రైతులు పాదయాత్ర కొనసాగుతోందని విమర్శించిన భూమన.. చంద్రబాబు నిర్ణయాలు రాయలసీమ వాసులను క్షోభకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు.. వైఎస్సార్ సీఎం అయ్యే వరకు రాయలసీమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన.. రాయలసీమకు ఇప్పటికీ తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నాడని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి..
తాజావార్తలు
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!