Andhra Pradesh: ఆర్టీసీ బస్సుకు టార్పాలిన్.. వివరణ ఇచ్చిన ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ వేసి తరలిస్తుండగా టీడీపీ ఫోటో తీసి ట్రోల్ చేసింది. ప్రభుత్వానికి బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్తో మీమ్ను టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు రూఫ్ ధ్వంసం కావడంతో బాగుచేయించే స్తోమత లేక ఇలా వాడుతున్నారా అనే కామెంట్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీపై తీవ్ర ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు. టీడీపీ పొలిటికల్ వింగ్ పోస్ట్ చేసిన ఫోటోలోని బస్సు ప్యాసింజర్లను తీసుకెళ్లడం లేదని వివరణ ఇచ్చారు. అటు బస్సు రూఫ్ లీక్ కూడా కాలేదని స్పష్టం చేశారు.
అయితే ఆర్టీసీ బస్సుకు టార్పాలిన్ ఎందుకు కప్పారన్న విషయంపై ఏపీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఇటీవల విద్యాసంస్థలు తెరుచుకోవడంతో ఆర్టీసీపై నమ్మకంతో విద్యాశాఖ స్కూల్ పుస్తకాల పంపిణీ బాధ్యతను తమకు అప్పగించిందని ఆర్టీసీ తెలిపింది. అందులో భాగంగానే ఆ బస్సులో పుస్తకాలను రవాణా చేశామని పేర్కొంది. స్కూళ్లు ప్రారంభం కావడంతో పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటం కోసం జిల్లా కేంద్రాల నుంచి భారీ సంఖ్యలో బస్సుల్లో పుస్తకాలను రవాణా చేస్తున్నామని వెల్లడించింది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు రవాణా చేయాల్సి ఉండటం, వర్షా కాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు కిటికీలను టార్పలిన్లతో కప్పి ఉంచామని ఆర్టీసీ స్పష్టం చేసింది. తాము చేస్తున్న మంచిపని పట్ల ప్రతికూలతను, వెరిఫై చేయని రూమర్లను ప్రచారం చేయడం తమకు షాకిచ్చిందని ఆర్టీసీ తెలిపింది. టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్టును వెంటనే డిలీట్ చేయాలని.. ఈ విషయంలో తాము న్యాయసలహా తీసుకుంటామని.. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఆర్టీసీ హెచ్చరించింది. దీంతో స్పందించిన టీడీపీ పొలిటికల్ వింగ్ సదరు పోస్టును డిలీట్ చేస్తామని ప్రకటించింది.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!