APNGO: ఏపీఎన్జీజీవోగా మారిన ఏపీఎన్జీవో .. గెజిటెడ్ ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APNGO: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏపీఎన్జీవో)గా ఇన్ని రోజులు కొనసాగిన సంఘం కాస్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ నాన్గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏపీఎన్జీజీవో)గా మారనుంది. ఈ మేరకు ఏపీఎన్జీవో బైలాస్లో మార్పు చేసినట్టు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీఎన్జీవో రాష్ట్ర 21వ మహాసభలో విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రెండో రోజు మహాసభ కొనసాగుతుంది. మహాసభలో రాష్ట్రంలోని సుమారు 30వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సోమవారం ప్రారంభమైన మహసభలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మహాసభలు ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం మహాసభల ముగింపు సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని మహాసభ ఎన్నుకోనుంది. మహాసభల సందర్భంగా ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
Read also: Samsung 440 MP Camera: శాంసంగ్ నుంచి 440 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ఫోన్లు.. ధర ఊహించడం కష్టమే!
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఏపీఎన్జీవో సంఘం బైలాలలో మార్పులు, చేర్పులు చేసినట్టు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి ఏపీఎన్జీవో సంఘం కాస్త ఏపీఎన్జీజీవోగా మారుతుందని స్పష్టం చేశారు. సంఘంలో మెంబర్షిప్ అధికంగా పెరగడంతో సంఘంలో పోస్టులను పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 5 పోస్టులను, జిల్లాల్లో 2, తాలూకాల్లో 2 పోస్టులను పెంచుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఏపీఎన్జీజీవో కాస్త 26 బ్రాంచీలుగా మారనుందన్నారు. అయితే ప్రభుత్వం తమ బైలాలో మార్పులను ఆమోదించాల్సి ఉంటుందని.. ప్రభుత్వం ఆమోదించిన తరువాత తాము చేసిన మార్పులు అమల్లోకి వస్తాయని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఏపీఎన్జీవో సంఘం నేత విద్యాసాగర్ మాట్లాడుతూ తమ ఎన్జీవో సంఘంలోని చాలా నాన్ గెజిటెడ్ పోస్టులు గెజిటెడ్ అయిపోయాయని.. అందువల్ల గెజిటెడ్ను కూడా తమ సంఘంలో చేర్చి పేరు మార్చినట్టు తెలిపారు. ఇకపై ఏపీఎన్జీజీవోగా తమ సంఘం కొనసాగుతుందని విద్యాసాగర్ తెలిపారు. 26 జిల్లాల్లో 250 పోస్టులు మహిళలకు కేటాయించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!