Samsung 440 MP Camera: శాంసంగ్ నుంచి 440 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ఫోన్లు.. ధర ఊహించడం కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Working on 440 Megapixel Camera Sensors: ప్రస్తుతం ప్రముఖ మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అందుకే ట్రెండ్కు తగ్గట్టు అప్డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అప్గ్రేడ్ చేస్తున్న ఫీచర్లలలో కెమెరా సెన్సార్ కూడా ఒకటి. ఫోన్ ధరను బట్టి కెమెరా క్వాలిటీని కంపెనీలు అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల కోసం టాప్ మొబైల్ కంపెనీలు హై ఎండ్ కెమెరా సెన్సార్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శామ్సంగ్’ ముందుంది. ఏకంగా 440 మెగాపిక్సెల్ కెమెరాను అందించే ప్రయత్నంలో ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ గెలాక్సీ S23 సిరీస్ను విడుదల చేసింది. ఈ సిరీస్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ (Samsung Galaxy S23+) మరియు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) మోడల్లు ఉన్నాయి. హై-ఎండ్ మోడల్ అల్ట్రా ఫోన్లో కంపెనీ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. తాజాగా శామ్సంగ్ కంపెనీ 440 మెగాపిక్సెల్ కెపాసిటీతో, ఒక అంగుళం పరిమాణంలో ఉండే సెన్సార్లపై కొత్త బ్యాచ్ పని చేస్తోందని సమాచారం తెలుస్తోంది.
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
శామ్సంగ్ మూడు కొత్త కెమెరా సెన్సార్లను 2024 చివరి నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని టిప్స్టర్ రెవెంగస్ అంచనా వేసినట్లు ఓ వెబ్ పోర్టల్ పేర్కొంది. 200 మెగాపిక్సెల్ HP7 సెన్సార్, 50 మెగాపిక్సెల్ GN6 (అంగుళం టైప్) సెన్సార్, 440 మెగాపిక్సెల్తో కొత్త HU1 సెన్సార్లపై శామ్సంగ్ పని చేస్తోందని టిప్స్టర్ సూచించాడు. రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లకు విలువైన కెమెరా అప్గ్రేడ్గా భావిస్తున్నారు. 600-మెగాపిక్సెల్ రిజల్యూషన్తో కెమెరా సెన్సార్లపై పని చేయాలనుకుంటున్నట్లు కంపెనీ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: Rohit Sharma: ప్రపంచకప్ 2023లో రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేస్తారు.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్!
200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ఫోన్ ధర ఒక లక్ష్య పైనే ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,24,999గా ఉంది. 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,34,999గా ఉండగా.. 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,54,999గా ఉంది. 200 మెగాపిక్సెల్ ఫోన్ ధర ఇంత ఉందంటే.. 440 మెగాపిక్సెల్ ధర ఊహించడం కష్టమే. ఇక సోనీ కంపెనీ ఇప్పటికే ఒక అంగుళం టైప్ సెన్సార్ IMX 989ను డెవలప్ చేసింది. ఒప్పో ఫైండ్ X6 ప్రో, షియోమి 13 ప్రో, వివో X90 ప్రో+, షియోమీ 12S అల్ట్రా వంటి ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో దీన్ని ప్రవేశపెట్టింది.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!