APCC Chief Tulasi Reddy: పోలవరం పూర్తయ్యేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APCC Chief Narreddy Tulasi Reddy About Polavaram Project: పోలవరం.. సంవత్సరాలు గడిచిపోతున్నా, ఈ ప్రాజెక్ట్ వ్యవహారం మాత్రం కొలిక్కి రావట్లేదు. రబ్బరు సాగదీసినట్టు.. దీనిని నాన్చుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇదంతా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్లేనని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. ఆ మూడు ప్రభుత్వాల కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే, 2016 నాటికే పోలవరం పూర్తయ్యేదని అన్నారు.
శుక్రవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక, జాతీయ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే.. ఇంకా రూ. 30 వేల కోట్లు కావాలన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే శక్తి లేదని.. అలాగే ఈ ప్రాజెక్టును సొంతంగా నిర్మించే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని జోస్యం చెప్పారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలవరం పూర్తవుతుందని వెల్లడించారు. అంతకుముందు బీజేపీ పార్టీ దేశానికి పట్టిన శనిగ్రహమని.. వైసీపీ, టీడీపీలు ఏపీకి పట్టిన రాహుకేతువలని తీవ్రస్థాయిలో తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.
Also Read
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- OTR : ఎచ్చర్ల టీడీపీలో అసంతృప్తి.. "మా గోడు వినేవారు ఎవరు?" అంటున్న తమ్ముళ్లు
- OTR : ఉండిలో వైసీపీకి వరుస ఓటములు? ఐదోసారి ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ!
- Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!