Gidugu Rudraraju: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. మోడీ రాజీనామా చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APCC Chief Gidugu Rudraraju Demands PM Narendra Modi To Resign Over Manipur Violence: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. మణిపూర్లో జరిగిన దారుణాలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఏపీసీసీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్లో జరిగిన హింస, అత్యాచారాలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం నివ్వెరపోయే ఈ ఘటనల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
Kakani Govardhan Reddy: చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
మణిపూర్ ఘటన చోటు చేసుకుని మూడు నెలలు అవుతున్నా.. ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సీజే సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ నాయకుడు రాహుల్గాంధీ మణిపూర్కి వెళ్తే, అడ్డుకున్నారని పేర్కొన్నారు. మణిపూర్ ఘటనపై తాము శాంతియుతంగా ప్రదర్శన చేశామన్నారు. ఆదివాసీ మహిళల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. మణిపూర్ సీఎం, గవర్నర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సుప్రీం ఆదేశాలతోనైనా స్పందించి.. బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రధాని మోడీ భారత జాతికి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. మోడీ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలపై దాడులు పెరిగాయని చెప్పుకొచ్చారు.
Pilli Subhash Chandrabose: పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ
ఇంతకుముందు కూడా.. దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీని ధీటుగా ఎదుర్కొనే సత్తా, కేవలం తమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకే ఉందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పార్లమెంట్లో రాహుల్ లేవనెత్తిన అంశాలపై మోడీ సమాధానం చెప్పలేకపోయారని, అందుకే ఆయన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!