Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Water Resources Principal Secretary Sasibhushan About Polavaram Project Authority Meeting

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం..!

Published Date :November 16, 2022 , 8:46 pm
By Sudhakar Ravula
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పోలవరం ప్రాజెక్టు పనులు వరదలు ఉన్నందున కాస్త నెమ్మదించాయి.. ఇక నుంచి వేగవంతం చేస్తామన్నారు ఏపీ జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌.. బ్యాక్ వాటర్‌పై ఉమ్మడి సర్వే అనేది ఉండదన్న ఆయన.. అన్ని అంశాలపై ఆమోదం వచ్చాకే కేంద్రం, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఇప్పుడు తెలంగాణ అభ్యంతరాలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.. హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశం జరిగింది.. ప్రాజెక్టు నిర్మాణం, బ్యాక్ వాటర్ ముంపు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం రాజమండ్రికి తరలింపు అంశాలు తదితర అంశాలపై చర్చ సాగింది.. సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో పాటు కేంద్ర జలశక్తి అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏపీ జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషన్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్ లో 15 అంశాలపై చర్చించాం.. ప్రాజెక్టు పనులు వరదలు ఉన్నందున కాస్త నిమ్మదించాయి… ఇక నుంచి వేగవంతం చేస్తామని.. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

Read Also: Balanagi Reddy: పవన్‌ను చంద్రబాబు దత్తత తీసుకునే ప్రయత్నం..! వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..

ప్రాజెక్టు కాపర్ డ్యామ్ పనులు జనవరి చివరి నాటికి పూర్తవుతాయి.. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పనులు కొలిక్కి వస్తాయి. గ్యాప్ వన్ పూర్తవుతుందన్నారు శశిభూషణ్‌.. పోలవరం బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వే అనేది ఉండదన్న ఆయన.. అన్ని అంశాలపై ఆమోదం వచ్చాకే కేంద్రం, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పుడు అభ్యంతరాలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.. పోలవరం ముంపు భూసేకరణ కొంత పెండింగ్ ఉంది. అది కూడా పూర్తవుతుందని తెలిపారు.. వర్కింగ్ సీజన్ లో పోలవరం ప్రాజెక్టు పనుల లక్ష్యాలు, వనరులపై పీపీఏ సమావేశంలో చర్చించామని.. వర్కింగ్ సీజన్ లో పనుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదించామన్న ఆయన.. దిగువ కాపర్ డ్యాం పనులను జనవరి నెలాఖరు వరకు పూర్తి చేస్తాం.. ప్రధాన డ్యాంకు సంబంధించిన పనుల ప్రారంభం కోసం డయాఫ్రామ్ వాల్ పరిస్థితిని పరీక్షిస్తాం.. 2023 జూన్ వరకు ప్రధాన డ్యాం పనులు గ్రౌండ్ లెవల్ వరకు తీసుకొస్తామని.. ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్ వరకు పూర్తి చేస్తాం అన్నారు.

ఇక, అన్ని అంశాలను అధ్యయనం చేశాకే పోలవరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయి.. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు, ఎవరూ అంగీకరించలేదన్నారు శశిభూషణ్‌.. మ్మడి అధ్యయనం, సర్వే అంటూ ఏదీ ఉండదు.. జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు రావడం పిల్లచేష్టలు కాదు కదా? అని ప్రశ్నించారు. ఎప్పటి వరకు అధ్యయనం చేసుకుంటూ పోవాలి? నచ్చినట్లు నివేదికలు వచ్చే వరకు అధ్యయనం చేయాలా? తెలంగాణ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలించి సమాధానం ఇస్తామని పీపీఏ స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం ఉంది. ఎలాంటి తాత్కాలిక, శాశ్వత ఉత్తర్వులు రాలేదన్నా యన.. అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు తెలిపింది.. రెండు సమావేశాలు జరిగినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు.. ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారన్నారు.. భూసేకరణపై కూడా పీపీఏ సమావేశంలో చర్చ జరిగింది.. రెండో దశలో మరో 30 నుంచి 40 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని.. అందుకోసం షెడ్యూల్ సిద్ధం చేసి ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని అందరూ కోరుతున్నారు.. రాజమహేంద్రవరంలో వసతి కోసం పరిశీలిస్తున్నామని వెల్లడించారు ఏపీ జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Polavaram Project Authority
  • Polavaram Project Authority Meeting
  • SASIBHUSHAN
  • telangana

తాజావార్తలు

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • CD Gopinath: భారత క్రికెట్‌‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!

  • Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్.. గిల్‌కు భారీ జరిమానా..!

  • Juvvaladinne Boats Missing Mystery issue: ఆ బోట్లు ఎక్కడ..? ఎవరి పాత్ర ఏంటి..?

  • Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions