Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- రూ.1,990 కోట్ల అర్బన్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
- ఏపీకి రూ.497 కోట్ల కేంద్ర గ్రాంట్ మంజూరు
- విశాఖ, మంగళగిరి-తాడేపల్లిలో మెగా పనులు
- 24/7 తాగునీరు, UGDపై ప్రభుత్వ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధునిక పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ఊతాన్నిచ్చింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో రూ. 1,990.83 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రతిష్టాత్మక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ (UCF) కింద ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ. 497.71 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం (సెంట్రల్ గ్రాంట్) లభించనుంది. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం (GVMC) , రాజధాని ప్రాంతంలోని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ మెగా ప్రాజెక్టులను నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పోటీ పద్ధతిలో ఎంపిక చేసే అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఏపీ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గొప్ప గుర్తింపు అని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో మౌలిక వసతుల (Infrastructure) కల్పనకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గతంలో లాగా కేవలం సాధారణ మున్సిపల్ రోడ్లు, లైట్ల పనులకే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త సాంకేతికతతో కూడిన ఆధునిక పట్టణాభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఆయన వివరించారు.
Also Read
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ప్రజల ప్రాథమిక అవసరాలైన సురక్షిత తాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ, , ఆధునిక మురుగునీటి శుద్ధి (Sewage Treatment) ప్లాంట్ల ఏర్పాటుపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. విశాఖపట్నంలోని మధురవాడ జోన్లో 24/7 స్మార్ట్ తాగునీటి సరఫరా, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నెట్వర్క్తో పాటు మంగళగిరి-తాడేపల్లి పరిధిలో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల ఆయా నగరాల్లో ప్రజారోగ్యం , ప్రజల జీవన ప్రమాణాలు (Quality of Life) గణనీయంగా మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నగరాలు ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా మారాలంటే అక్కడ ‘కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ ను అందరికంటే ముందుగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అర్బన్ చాలెంజ్ ఫండ్ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుందని, మార్కెట్ పెట్టుబడులు , బ్యాంక్ రుణాల సమన్వయంతో ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పించి, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పట్టణ మౌలిక వసతులు కలిగిన మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, రాబోయే రోజుల్లో పట్టణాభివృద్ధి విభాగంలో ఏపీ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!