ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు అవినీతి అధికారులు మాత్రం దొరికినంత దోచుకో అనే తరహాలో ముందుకు సాగుతున్నారు.
Also Read
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ. జిల్లాలో కొన్ని రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన అక్రమాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ల దగ్గర మొదలై.. నకిలీ చలానాలు సృష్టించడం.. అసలు చలానాలే లేకుండా రిజిస్ట్రేషన్లు చేసేంత బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో సీఎస్ఎంఎస్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల లావాదేవీలు, వాటి చలాన్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేయగా… ఇప్పటివరకు ఆరు డాక్యూమెంట్లకు సంబంధించి 16 నకిలీ చలానాల ద్వారా 2.96 లక్షలను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మరో 38 దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం వివిధ పద్దుల కింద 107 చలానాలపై సొమ్ము చెల్లించారు.
సీఎఫ్ఎంఎస్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమకాలేదు. దీనిపై ప్రాథమికంగా పరిశీలించకుండానే దస్తావేజుల రిజిస్ట్రేషన్ను పూర్తిచేశారు. 2018-19కి సంబంధించి 21.29 లక్షల సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరలేదని గుర్తించారు అధికారులు. గతంలో కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ నాసిర్ ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లటంతో ఇన్ ఛార్జిగా పనిచేసిన జానియర్ అసిస్టెంట్ హరీష్ కూడా నకిలీ చలానాల ఆధారంగా 4 దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేశారని అధికారుల తనిఖీల్లో తేలింది. మూడేళ్ల డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిషేధిత భూములకు, ప్రభుత్వ భూములకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ సాగుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!