ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు అవినీతి అధికారులు మాత్రం దొరికినంత దోచుకో అనే తరహాలో ముందుకు సాగుతున్నారు.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ. జిల్లాలో కొన్ని రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన అక్రమాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ల దగ్గర మొదలై.. నకిలీ చలానాలు సృష్టించడం.. అసలు చలానాలే లేకుండా రిజిస్ట్రేషన్లు చేసేంత బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో సీఎస్ఎంఎస్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల లావాదేవీలు, వాటి చలాన్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేయగా… ఇప్పటివరకు ఆరు డాక్యూమెంట్లకు సంబంధించి 16 నకిలీ చలానాల ద్వారా 2.96 లక్షలను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మరో 38 దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం వివిధ పద్దుల కింద 107 చలానాలపై సొమ్ము చెల్లించారు.
సీఎఫ్ఎంఎస్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమకాలేదు. దీనిపై ప్రాథమికంగా పరిశీలించకుండానే దస్తావేజుల రిజిస్ట్రేషన్ను పూర్తిచేశారు. 2018-19కి సంబంధించి 21.29 లక్షల సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరలేదని గుర్తించారు అధికారులు. గతంలో కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ నాసిర్ ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లటంతో ఇన్ ఛార్జిగా పనిచేసిన జానియర్ అసిస్టెంట్ హరీష్ కూడా నకిలీ చలానాల ఆధారంగా 4 దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేశారని అధికారుల తనిఖీల్లో తేలింది. మూడేళ్ల డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిషేధిత భూములకు, ప్రభుత్వ భూములకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ సాగుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
-
Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!