CM Chandrababu : కోర్టుల్లో కొట్లాడి విజయవంతంగా రిక్రూట్మెంట్ పూర్తిచేశాం
- మంగళగిరిలో కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేత
- 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు
- ఈనెల 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు ట్రైనింగ్
- కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేయకుండా 31 కేసులు వేశారు
- కోర్టుల్లో కొట్లాడి విజయవంతంగా రిక్రూట్మెంట్ పూర్తిచేశాం
- నేను ఎప్పుడొచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను. -సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రశంసించారు. తమ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత రాష్ట్రానికి గర్వకారణమని వారు అభినందించారు. పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బాబురావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, అఖిల భారత సర్వీసు సాధించి జిల్లాకు ఎస్పీ కావాలని సూచించారు. ఈ సందర్భంగా బాబురావు తన స్వగ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సీఎంను కోరగా, ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. అలాగే, బలభద్రపురం గ్రామానికి చెందిన మణికంఠ కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. మణికంఠ బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి కానిస్టేబుల్గా ఎంపికయ్యాడని వివరించారు.
గుంటూరు అర్బన్ ప్రాంతానికి చెందిన కాశింశెట్టి అఖిల్ గోపీచంద్ చిన్నతనం నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివాడని సీఎం తెలిపారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అఖిల్ తన లక్ష్యాన్ని సాధించడంలో పట్టుదల చూపాడని ప్రశంసించారు. యువత ముఖాల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్న మహిళా కానిస్టేబుల్ కొమ్ము శిరీష తన అనుభవాలను పంచుకున్నారు.
Also Read
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Syed Mushtaq Ali Trophy 2025: చరిత్ర సృష్టించిన ఝార్ఖండ్.. ఓటమితో ఎస్ఎంఏటీ ఫైనల్కు దూసుకెళ్లిన టీం
అన్నమయ్య జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి తాను వచ్చానని, ఆడపిల్లలను చదివించవద్దని చాలామంది చెప్పినా, తన తండ్రి మాత్రం ఆడబిడ్డలు–మగబిడ్డలు అన్న తేడా లేకుండా సమానంగా చూసేవారని చెప్పారు. తన సోదరి బిహార్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతోందని, తనను కూడా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివించారని శిరీష వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలను అసాధారణ పట్టుదలతో చదివించిన తల్లిదండ్రులు నిజంగా అభినందనీయులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటువంటి తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Tejasvi Singh-IPL 2026: కేకేఆర్కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!