NTR Vaidya Seva Scheme: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
- నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
- రూ.3000 కోట్ల బకాయిలపై ఆసుపత్రుల ఆగ్రహం
- UHC విధానంపై తీవ్ర అభ్యంతరాలు
- పేద రోగులకు వైద్యం అందక ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పేదలకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నేటి నుంచి నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. గత కొంతకాలంగా పేరుకుపోయిన భారీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, పాత ప్యాకేజీ ధరలనే కొనసాగించాలన్న మొండి వైఖరిని నిరసిస్తూ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు నెలల కాలంలో చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,500 కోట్ల నుండి ఏకంగా రూ. 3,000 కోట్లకు చేరుకున్నాయని, వీటి చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడంతో చిన్న తరహా ఆసుపత్రులు నిర్వహణ భారమై మూతపడే స్థితికి చేరుకున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Chery Fulwin T9L: చెరీ ఫుల్విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్తో గేమ్ చేంజర్!
Also Read
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
- Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
బకాయిల సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC) విధానంపై కూడా ఆసుపత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ప్రామాణికంగా తీసుకుని ఇన్సూరెన్స్ మోడల్లో చెల్లింపులు చేస్తామనడాన్ని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తోసిపుచ్చారు. పెరిగిన మందుల ధరలు, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులు , సిబ్బంది జీతాల దృష్ట్యా పదేళ్ల క్రితం నాటి ధరలతో నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యాకేజీలను సవరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 3,000 కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం , ఆసుపత్రుల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!