NTR Vaidya Seva Scheme: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
- నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
- రూ.3000 కోట్ల బకాయిలపై ఆసుపత్రుల ఆగ్రహం
- UHC విధానంపై తీవ్ర అభ్యంతరాలు
- పేద రోగులకు వైద్యం అందక ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పేదలకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నేటి నుంచి నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. గత కొంతకాలంగా పేరుకుపోయిన భారీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, పాత ప్యాకేజీ ధరలనే కొనసాగించాలన్న మొండి వైఖరిని నిరసిస్తూ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు నెలల కాలంలో చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,500 కోట్ల నుండి ఏకంగా రూ. 3,000 కోట్లకు చేరుకున్నాయని, వీటి చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడంతో చిన్న తరహా ఆసుపత్రులు నిర్వహణ భారమై మూతపడే స్థితికి చేరుకున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Chery Fulwin T9L: చెరీ ఫుల్విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్తో గేమ్ చేంజర్!
Also Read
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
బకాయిల సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC) విధానంపై కూడా ఆసుపత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ప్రామాణికంగా తీసుకుని ఇన్సూరెన్స్ మోడల్లో చెల్లింపులు చేస్తామనడాన్ని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తోసిపుచ్చారు. పెరిగిన మందుల ధరలు, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులు , సిబ్బంది జీతాల దృష్ట్యా పదేళ్ల క్రితం నాటి ధరలతో నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యాకేజీలను సవరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 3,000 కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం , ఆసుపత్రుల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!