Minister Roja Dance: హంసధ్వని పుస్తకావిష్కరణలో.. పాటకు స్టెప్పులేసిన మంత్రి
Srikakulam Roja Dance: శ్రీకాకుళం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వెల్లడించారు. 76 వ స్వాతంత్య్రం సందర్భంగా కళ్లేపల్లిలోని ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంస ధ్వని తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా.. 12వ తేదీ నుండి 14 వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా హాజరై హంసధ్వని పుస్తకాన్ని రోజా ఆవిష్కరించారు.
అనంతరం చామంతి పువ్వా పువ్వా… అనే పాటకు స్టెప్ లు వేసి జనాలను మంత్రి రోజా ఉత్సాహ పరుస్తూ.. వారితోపాటు మంత్రి రోజా స్టెప్పులు వేశారు. దీంతో ఆప్రాంతమంతా ఆటపాటలతో సంతోమయమైంది. మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే అనడానికి నిర్వచణంగా ఆప్రాంతమంతా నిదర్శనమైంది. అనంతరం మంత్రి రోజా మట్లాడుతూ.. ఎంతో చరిత్రకలిగిన శ్రీకాకుళం సంప్రదాయ గురుకుళంలో గత మూడు రోజులుగా జరుగుతున్న హంసధ్వని మెగా ఈవెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యావత్ భారత దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్వాతి సోమనాథన్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందించారు. మూడు రోజుల పాటు ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఈ హంసధ్వని ద్వారా.. గొప్ప సందేశాన్ని ఇక్కడున్న ప్రజలకు అందించారని పేర్కొన్నారు.
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో వజ్రోత్సవాలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి వజ్రోత్సవాలలో భాగంగా.. మన దేశంలోనే వజ్రం లాంటి సంప్రదాయ గురుకులంకి నేను రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈకార్యక్రమ ఉద్దేశం ధ్యానం మంచి ఆరోగ్యానికి సహకరించే సాధనా ప్రక్రియ అని రోజా పేర్కొన్నారు. అటువంటి ధ్యాన సంబంధ పిరమిడ్ల నిర్మాణానికి సహకరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు మంత్రి రోజా. పోటీ ప్రపంచంలో.. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలకి, వారిలో ఒత్తిడిని వారు జయించడానికి ఇలాంటి మంచి కళలు, సంగీతం, నాట్యం. క్రీడల వైపు కాస్త ద్రుష్టి మల్లించేల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నానని రోజా తెలిపారు.
PM Narendra Modi: భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!