బాబు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని.. చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్ 2023 లోపు పూర్తి చేస్తామన్న ఆయన.. ప్రకాశం జిల్లాకు నీళ్ళందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకు నీరందించే కార్యక్రమం చేస్తున్నామని.. ఉత్తరాంధ్రలోనూ నీరందించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారి.. ఆయన అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంటే…చంద్రబాబు చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు తర్వాత 2015లో తెలంగాణలో ప్రాజెక్టులు చేపట్టింది నిజం కాదా…? అని ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్.. ఆ రోజే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ చేపట్టి ఉంటే ఈ రోజు అన్యాయం జరిగేది కాదన్న ఆయన.. తెలంగాణ వాదాన్ని చంద్రబాబు ఈ రాష్ట్రంలో వినిపిస్తున్నారు అని ఆరోపించారు.. కరువుతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో కేసులు వేయించించిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది కాదా? అంటూ ఫైర్ అయిన ఆయన.. బాబు సొంత జిల్లాలో జలాశయం కడితే ఓర్చుకోలేక కేసు వేయించారన్నారు.. ఈ రాష్ట్రానికి చంద్రబాబుతో సహా కొన్ని మీడియా సంస్థలు కూడా దెయ్యాల్లా తయారయ్యానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ ప్రాజెక్టులు చేపట్టి ఏడాదిన్నర తర్వాత వీళ్ళు ఇప్పుడు మాట్లాడటమేంటి..? అని ప్రశ్నించిన అనిల్.. ఈ రోజు తెలంగాణ మాట్లాడుతున్న దానికి వీళ్ళు వంత పాడుతున్నారని.. అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి సంబంధించి మీ విధానం ఏమిటి…? రాయలసీమ లిఫ్ట్ గురించి మీ వైఖరి ఏమిటి…? తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై మీ వైఖరి ఏమిటి…?.. చంద్రబాబు స్పష్టమైన విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!