బాబు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని.. చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్ 2023 లోపు పూర్తి చేస్తామన్న ఆయన.. ప్రకాశం జిల్లాకు నీళ్ళందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకు నీరందించే కార్యక్రమం చేస్తున్నామని.. ఉత్తరాంధ్రలోనూ నీరందించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారి.. ఆయన అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంటే…చంద్రబాబు చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు తర్వాత 2015లో తెలంగాణలో ప్రాజెక్టులు చేపట్టింది నిజం కాదా…? అని ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్.. ఆ రోజే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ చేపట్టి ఉంటే ఈ రోజు అన్యాయం జరిగేది కాదన్న ఆయన.. తెలంగాణ వాదాన్ని చంద్రబాబు ఈ రాష్ట్రంలో వినిపిస్తున్నారు అని ఆరోపించారు.. కరువుతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో కేసులు వేయించించిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది కాదా? అంటూ ఫైర్ అయిన ఆయన.. బాబు సొంత జిల్లాలో జలాశయం కడితే ఓర్చుకోలేక కేసు వేయించారన్నారు.. ఈ రాష్ట్రానికి చంద్రబాబుతో సహా కొన్ని మీడియా సంస్థలు కూడా దెయ్యాల్లా తయారయ్యానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ ప్రాజెక్టులు చేపట్టి ఏడాదిన్నర తర్వాత వీళ్ళు ఇప్పుడు మాట్లాడటమేంటి..? అని ప్రశ్నించిన అనిల్.. ఈ రోజు తెలంగాణ మాట్లాడుతున్న దానికి వీళ్ళు వంత పాడుతున్నారని.. అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి సంబంధించి మీ విధానం ఏమిటి…? రాయలసీమ లిఫ్ట్ గురించి మీ వైఖరి ఏమిటి…? తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై మీ వైఖరి ఏమిటి…?.. చంద్రబాబు స్పష్టమైన విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..