Atchannaidu vs Botsa: శాసన మండలిలో మంత్రి అచ్చెన్న వర్సెస్ బొత్స మధ్య మాటల యుద్ధం..
- శాసన మండలిలో కొనసాగుతున్న గందరగోళం..
- మండలిలో మంత్రి అచ్చెన్న వర్సెస్ బొత్స మధ్య మాటల యుద్ధం..
- రైతుల సమస్యలు, యూరియాపై చర్చించాలని వైసీపీ డిమాండ్..
- బీఏసీ సమావేశం తర్వాతే చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu vs Botsa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షకాల సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా మండలిలో మొదట రైతాంగ సమస్యలు, యూరియా కొరతపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఇక, వైసీపీ ఆందోళనలతో శాసన మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.
Read Also: Pakistan Cricket: అక్కడ 16 మిలియన్ డాలర్లు.. పాకిస్థాన్కు అంత సీన్ లేదు!
Also Read
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
అయితే, వైసీపీ సభ్యుల ఆందోళనపై మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. యూరియా కొరత, వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది అని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియజేసే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక, బీఎసీ సమావేశం అనంతరం సభలో చర్చ చేపట్టేందుకు సిద్దమని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఇక, మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
Read Also: Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
ఇక, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని మంత్రి అచ్చన్నాయుడుని ప్రశ్నించారు. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం.. రైతాంగం బాగుంటే అందరూ బాగుంటారు.. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నామని డిమాండ్ చేశారు.
కాగా, బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందనేది చర్చ జరగాలి.. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చర్చిద్దాం.. సభ ద్వారా రైతులకు అన్నీ విషయాలు తెలియాలి.. రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాం.. రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందనేది చెప్పటానికి మేం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు అని మంత్రిని అడిగారు. ఈ రోజే చర్చిస్తే తప్పేముంది.. గతంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు.. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే, ఈరోజే చర్చించమని కోరుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
-
US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!