Pakistan Cricket: అక్కడ 16 మిలియన్ డాలర్లు.. పాకిస్థాన్కు అంత సీన్ లేదు!
- పాకిస్థాన్, యూఏఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు
- గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం
- పీసీబీ తీరుపై మురళీ కార్తిక్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఆటగాళ్లు మైదానానికి వచ్చారు. అన్ని పరిణామాల నేపథ్యంలో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభం అయింది.
Also Read: Asia Cup 2025: అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ
Also Read
- US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి...
- PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
పీసీబీ తీరుపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మురళీ కార్తిక్ విమర్శలు గుప్పించారు. టోర్నీని బాయ్కాట్ చేసేంత సీన్ పాకిస్థాన్కు లేదన్నారు. ‘పాకిస్థాన్ జట్టుకు ఓ విషయం చెప్పాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండండి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఇలానే ఉంటారు. పాక్ జట్టుకు మాత్రం అలా ఉండదు. అందుకు కారణం లేకపోలేదు. 16 మిలియన్ డాలర్ల ఆదాయం పీసీబీకి కనిపిస్తోంది. టీమిండియా కరచాలనం వివాదంతో భారీ మొత్తాన్ని వద్దనుకొనే పరిస్థితి పాక్కు లేదు. బాయ్కాట్ చేస్తామని చెప్పడం అస్సలు బాగోలేదు. చిన్న పిల్లలు కూడా ఇలా చేయరు. ఇదంతా నాకు ఫన్నీగా అనిపిస్తోంది. ఫాన్స్ ఇంట్లో కూర్చునే ఇదంతా చూస్తున్నారు. గంటపాటు ఆలస్యంగా ఎందుకు మ్యాచ్ స్టార్ట్ అయిందని చర్చించుకుంటారు. పాకిస్థాన్లోని అభిమానులు, చిన్నారులు తమ స్టార్లు ఎలా ఆడతారని ఆసక్తిగా ఉంటారు. మీరు మాత్రం లేనిపోని వివాదాలకు తెరదీస్తారు. పీసీబీ పరువు పూర్తిగా పోయింది’ అని మురళీ కార్తిక్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!