AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP IAS Officer: ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ బి.నవ్య తన కుమారుణ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. తాను కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లోనే చదువుకొని ఐఏఎస్ అధికారిణి అయ్యానని గుర్తు చేసుకున్నారు. నవ్య శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్(పీవో)గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు బి.శ్రీకర్ ప్రతిక్ ఆరో తరగతి చదువుతున్నాడు. అతణ్ని నవ్య.. మల్లి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు.
ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ ఏపీ సర్కారు విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అన్ని చోట్లా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని వెల్లడించారు. సీతంపేట మండలంలో ప్రైవేట్ స్కూల్స్ లేవని, 40 కిలో మీటర్ల దూరంలోని పాలకొండ మండలంలో ఉన్నాయని నవ్య చెప్పారు.
Also Read
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
read also: BJP District President: ద్రౌపదీ ముర్ము విజయోత్సవ సభ.. తప్పతాగి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
నిత్యం 40 కిలోమీటర్లు వెళ్లటం, రావటం ఇబ్బందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని ఆమె వివరించారు. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించేందుకు మధ్య తరగతి కుటుంబాల పేరెంట్స్ సైతం పోటీపడుతున్న ఈ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ తన కుమారుణ్ని సర్కారు బడిలో జాయిన్ చేయించటం నిజంగా అధినందించదగ్గ విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు. నవ్య తలచుకుంటే తన కొడుకుని ఏ కార్పొరేట్ స్కూల్లోనో చేర్చించగలరు. కానీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి ఉచితంగా చదువు చెబుతున్నప్పుడు లక్షలు ఖర్చు చేయటం దేనికి అనేది ఆమె ఉద్దేశంగా కనిపిస్తోంది.
సాక్షాత్తూ ఒక ప్రభుత్వ అధికారిణి అయుండి ఆ ప్రభుత్వ బడి పైనే నమ్మకం ప్రదర్శించకపోతే ఎలా?. ఆర్థిక స్తోమత అనే సంగతిని పక్కన పెట్టి అసలు ఆ స్కూల్లో మంచిగా చదువు చెబుతున్నారా లేదా అనేది చూడాలి. నిజం చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ బడిలోనే ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు. కాకపోతే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్లతో రెగ్యులర్గా హోం వర్క్ చేయిస్తూ అర్థంకాని విషయాలేమైనా ఉంటే వాటిని తల్లిదండ్రులు వివరిస్తే సరిపోతుంది. ఈ మాత్రం దానికి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్కి పంపించాల్సిన అవసరం లేదు అని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!