Pegasus Enquiry: పెగాసెస్ పై హౌస్ కమిటీ విచారణ.. ఇక దూకుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెగాసెస్ పై అసెంబ్లీ హౌస్ కమిటీ తొలి సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చట్ట విరుద్ధంగా వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మార్చిలో హౌస్ కమిటీ వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశం అయింది హౌస్ కమిటీ. రేపు హోం తదితర శాఖల అధికారులతో సమావేశం కానుంది హౌస్ కమిటీ.
టీడీపీ హయాంలో పెగాసెస్ నిఘా పరికరాలను వినియోగించారన్న ఆరోపణలపై ఏర్పాటైన ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ విచారణలో వేగంపెంచింది. విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకే టీడీపీ ప్రభుత్వం పెగాసస్ పరికరాలను వినియోగించిందన్న వార్తలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భారీ రచ్చ జరిగింది. అయితే తామేమీ ఈ పరికరాలను వాడలేదని, అసలు వాటిని కొనుగోలే చేయలేదని టీడీపీ వాదించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌజ్ కమిటీని నియమించింది.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
ఈ కమిటీ మంగళవారం అమరావతిలోని అసెంబ్లీలో తొలిసారి భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించింది కమిటీ. హౌస్ కమిటీ విచారణలో భాగంగా రేపు హోం శాఖ సహా వివిధ శాఖల అధికారులను విచారించనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలు శాఖల అధికారులను విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖలకు కమిటీ లేఖలు రాసింది. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించనున్న కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. అసలు పెగాసెస్ వ్యవహారంలో ఏం జరిగిందనేది త్వరలో తేలనుంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!