రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. ఓ మహిళా భూమి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపుల జాప్యం పై సీరియస్ అయ్యింది న్యాయ స్థానం. ఆ ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఐదుగురిలో రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాల జైలుతో పాటు వెయ్యి ఫైన్ వేసింది. అలాగే ఎస్ ఎస్ రావత్ కు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి ఫైన్, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, వెయ్యి ఫైన్ విధించింది. మరొక ఐఏఎస్ కు కూడా శిక్ష విధించింది. అయితే వీరికి అప్పీల్ చేసుకునేందుకు నెల రోజులు ఇచ్చిన హైకోర్టు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది.