AP High Court: మోహన్బాబు అండ్ సన్స్కు హైకోర్టులో ఊరట..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ప్రముఖ హీరో మంచు మోహన్బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మోహన్బాబు, ఆయన కుమారులు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నాపై అప్పటి పోలీసులు పలు కేసులు నమోదు చేయగా.. వీటిపై తిరుపతి కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల మోహన్బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తాము నిర్వహించిన ధర్నాపై తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also:Kashmir: 30 ఏళ్ళ తరువాత కశ్మీర్ థియేటర్లో వేసిన మొట్ట మొదటి సినిమా ఏదంటే..?
Also Read
మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాద, ప్రతివాదనలను విన్న హైకోర్టు తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని నిరసిస్తూ 2019 మార్చి 22న మోహన్బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అయితే ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్బాబు, విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్లపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని.. వాహనదారులకు ఇబ్బంది కలిగించారని పోలీసులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..