AP Govt- Google Deal: నేడే ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం..
- నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం..
- ఈరోజు ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒప్పందం..
- కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్..
- విశాఖను కృత్రిమ మేధా నగరంగా రూపొందించడంలో తొలి అడుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt- Google Deal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈరోజు ( అక్టోబర్ 14న) ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ‘‘గూగుల్ ఏఐ హబ్’’ పేరుతో ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉదయం 10గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఈ ఎంఓయూపై సంతకాలు పెట్టనున్నాయి.
Read Also: 10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అయితే, ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలపడం కోసమే చంద్రబాబు సర్కార్ ఈ ఒప్పందం చేసుకుంటుంది. ఇక, మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబరు 31న యూఎస్ టూర్ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. అనంతరం గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ కంపెనీ ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్థిలో ఏపీ కీలకంగా వ్యవహరించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.88,628 కోట్ల పెట్టుబడి ఏపీలో పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పాలి. ఈ పెట్టుబడితో వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. యువత కోసం ఏఐ నైపుణ్యాభివృద్థి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!