GPF Money: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీగా విత్ డ్రా
ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీ ప్రభుత్వం ఎక్కడ రుణం దొరికితే అక్కడ అప్పులు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా చేసింది ఏపీ ప్రభుత్వం. 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్ల మేర ప్రభుత్వం డ్రా చేసినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని తప్పు పడుతూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ స్పష్టీకరిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ… ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయి. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయిపోతే.. కేసు నమోదు చేస్తామని చెబితే.. తిరిగి డబ్బులు జమ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకుని చూస్తే డబ్బులు విత్ డ్రా అయినట్టు వెలుగులోకి వచ్చింది. నా ఖాతా నుంచే రూ. 80 వేల మేర డ్రా అయింది. నా ఒక్కడికే కాదు.. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను ప్రభుత్వం డ్రా చేసేసిందన్నారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
గతంలో జమ చేసిన డీఏ బకాయిలను తిరిగి ప్రభుత్వం తీసేసుకుంది.రూ. 800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల నుంచి ప్రభుత్వం డ్రా చేసేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల కోసం ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం డ్రా చేసేసింది. నా అనుమతి లేకుండా నా ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది..? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేసేది తప్పు కాదు.. నేరం. మా జీపీఎఫ్ డబ్బులను తీసుకున్న ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెడతాం. మా డబ్బులను తిరిగి మా ఖాతాల్లో జమ చేసినా సరే.. కచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మేం ఏజీని కూడా ప్రశ్నిస్తాం. మార్చి నెలాఖరులో డబ్బులు విత్ డ్రా చేస్తే.. ఇప్పటి వరకు మెసేజ్ ఇవ్వకపోవడం తప్పు అంటున్నారు.
Building Collapse: ముంబయిలో కుప్పకూలిన భవనం.. 14 మంది మృతి
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!