Montha Effect : ఏపీని ముంచిన మొంథా.. ఎన్ని కోట్ల నష్టమంటే..?
- తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా
- మొంథా తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం
- వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం
- ఆర్అండ్బీలో ఎక్కువ నష్టం జరిగింది. -సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Montha Effect : ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో తుఫాన్ నష్టంపై ప్రాథమిక అంచనా నివేదికను అధికారులు సమర్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అందులో రోడ్లు, భవనాల శాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువగా నమోదైందని అని తెలిపారు.
Also Read
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే పశుసంవర్థక రంగంలో కొంత నష్టం నమోదైనట్లు చెప్పారు. “20 పశువులు చనిపోయాయి, రూ.71 లక్షల మేర నష్టం జరిగింది” అని వివరించారు. హార్టికల్చర్, సిరికల్చర్, ఆక్వా రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం, సిరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం సంభవించిందన్నారు. ఆక్వా రంగం అత్యధికంగా రూ.1,270 కోట్ల మేర నష్టపోయిందని వివరించారు.
మున్సిపల్ శాఖకు కూడా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని సీఎం తెలిపారు. “మున్సిపల్ మౌలిక వసతులకు రూ.109 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశాం,” అని చెప్పారు.అంతేకాకుండా.. “తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. రైతులు, ప్రజలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని ఆయన తెలిపారు.
Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్కు అతిపెద్ద దౌత్య విజయం..
తాజావార్తలు
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?