Republic Day 2023: ఇది సంక్షేమ ప్రభుత్వం.. 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించని గవర్నర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటోంది.. మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామని మంత్రులు చెబుతున్నారు.. అయితి.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానులు ప్రస్తావనే లేకుండా ప ఓయింది.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.. గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు.. జిల్లాల విభజన అంశం వివరణకే పరిమితం అయ్యారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.. ప్రధాన డ్యామ్లో 78.64 శాతం, ఆర్ అండ్ ఆర్ లో 22.11 శాతం పనులు పూర్తి అయినట్లు గవర్నర్ ఉపన్యాసంలో స్పష్టం చేశారు..
Read Also: Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్లో రాంబాబు స్పీడ్
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు గవర్నర్.. విద్య, వైద్య-ఆరోగ్య రంగాలకు కీలక ప్రాధాన్యత ఉందన్న ఆయన.. నవరత్నాలు చాలా వర్గాలకు భద్రతగా ఉన్నాయని వివరించారు.. వైఎస్సార్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, సున్నా వడ్డీ.. రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.. ఆరోగ్య శ్రీ, 104, 108 వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.. ఫ్యామిలి ఫిజిషియన్ కార్యక్రమం మంచి మార్పులు తెస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల వల్ల మహిళలకు ఆర్ధిక సాధికారత లభిస్తోందన్నారు.. విలేజ్, వార్డ్ సచివలయాల వల్ల సామాన్యులకు పాలన దగ్గర అయ్యిందని.. పేదలకు ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
రాష్ట్ర పారిశ్రామికం అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు గవర్నర్ బిశ్వభూషణ్.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.. నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టడమే కాకుండా.. దిశ యాప్ తో మహిళలకు భద్రతకు భరోసా ఇస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్తున్నారని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా పాలనపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డైనమిక్ నాయకత్వం, మానవీయ దృక్పథంతో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందన్నారు.. ఇదే స్ఫూర్తితో అభివృద్ధి సాధించింది రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆకాక్షించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?