Abdul Nazeer: గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు పాత్ర ఎంతో ముఖ్యమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Governor Abdul Nazeer Speech In Nabard 42 Years Celebrations: గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు ప్రధాన పాత్ర పోషించిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధి కూడా నాబార్డు ఎంతో తోడ్పడిందని కొనియాడారు. మంగళవారం ఘనంగా నిర్వహించిన నాబార్డు 42వ ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982 జులై 12వ తేదీన నాబార్డు ఆవిర్భవించిందని, ఈరోజు ఈ సంస్థ 42వ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. నాలుగు దశాబ్దా్లో నాబార్డు 8.01 లక్షల కోట్ల టర్నోవర్కు చేరిందని తెలిపారు.
Vithika Sheru : యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో సంపాదిస్తున్న వితిక..
Also Read
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నాబార్డు వాళ్లు ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తున్నారని అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. రూ.47,695 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నాబార్డు రీజనల్ అధికారులు ఏపీలో ఆమోదం తెలిపారని, అందుకు వారికి నా అభినందనలని తెలుపుతున్నానని అన్నారు. PACS అభివృద్ధిలోనూ నాబార్డు పాత్ర ఎంతో ప్రముఖమైందన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లోనూ నాబార్డు ప్రధాన పాత్ర పోషించిందని.. గ్రామీణ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ సంబంధిత అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసిందని తెలియజేశారు. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యల్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు తన సహకారం కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో గవర్నర్ను పొందూరు ఖద్దురుతో చేసిన కండువా కప్పి సత్కరించారు.
Adipurush: రాత్రి తాగేసి పొద్దున్నే దేవుడంటే ఎలా?.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
అనంతరం నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ.. నాబార్డ్ చాలా అవకాశాలు తయారు చేసి.. రైతులకు, మహిళలకు ఉపయోగపడే విధంగా పనిచేసింద్నారు. వ్యవసాయ, గ్రామీణ స్ధాయిలో 1600 కోట్ల పెట్టుబడి ఏపీ ప్రభుత్వంతో కలిసి చేశామన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరెషన్తో కలిసి రూ.3000 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టామన్నారు. ఆదివాసీ ప్రాజెక్టుల్లో 30వేల ఎకరాల్లో అభివృద్ధికి పెట్టుబడి పెట్టామన్నారు. ఆదివాసీ, గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాలకు మాల్స్లో స్టాల్స్ ఏర్పాటు చేశామన్నా ఆయన.. సహజ వనరులు ఎక్కువగా ఉన్న ఏపీలో ప్రత్యేక కార్యాలయాలు తమకున్నాయన్నారు.
తాజావార్తలు
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..