ప్రస్తుతం ఏపీలో కరోనా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే నెలకు వ్యాక్సినేషన్ ప్లాన్ సిద్దం చేసుకుంది. మొత్తంగా ఏపీకి 70.86 లక్షల కరోనా టీకాలు వస్తాయని ఏపీ సర్కార్ అంచనా వేస్తుంది. వీటిల్లో ప్రభుత్వానికి 53.14 లక్షలు, ప్రైవేట్ ఆస్పత్రులకు 17.72 లక్షల టీకాలు కేటాయించింది. అయితే జులై నెలలో సుమారుగా 31.25 లక్షల మందికి రెండో డోస్ వేయాల్సి ఉంటుందని అంచనా. అందుకే మెజార్టీ టీకా డోసులు సెకండ్ డోస్ వేసే వారికే కేటాయించాల్సి రావడంతో ప్రణాళికా బద్దంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనుంది వైద్యారోగ్య శాఖ. వీలైనంత ఎక్కువ డోసులను తెప్పించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెడుతున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు.