Andhra Pradesh: తిరుపతిలో గోడలపై వైసీపీ రంగులు.. వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు, రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగాయి. గోడలపై ఉన్న దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త కళాకృతులను చిత్రీకరించే పనులు కొనసాగుతున్నాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. అందులో భాగంగా పలువురి జాతీయనేతల చిత్రాలను నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో గోడలపై చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించింది.
The mala fide campaign about the Tirupati city wall paintings is derogatory in nature. The beautification work is being carried out across the city where faded wall paintings are being painted over with new artwork featuring national heroes in prominent areas of the city. pic.twitter.com/G43askyvdT
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 28, 2022
కాగా తిరుపతిలో రోడ్డు పక్కన ఉండే గోడల సుందరీకరణ కార్యక్రమం దశల వారీగా జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. అంతగా బాధపడిపోతున్న నేతలు ఒకసారి వచ్చి ఇక్కడ చేపడుతున్న కళాకృతులను చూసి, అభినందించాల్సిందిగా కోరుతున్నామని సూచించింది. అయితే టీడీపీ మాత్రం మరోలా స్పందించింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. కొందరు వైసీపీ నేతలు దురుద్దేశంతోనే గోడలకు వైసీపీ రంగులు వేశారని మండిపడింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కి.మీ. మేర దేవతా మూర్తుల బొమ్మలు చెరిపేసి, 10 మీ. ఉన్న చోటు చూపించి మోసం అంటావ్ ఏంటి ఫేక్ ఫెలో ? కేవలం నాలుగు బొమ్మలు మిగిల్చి, మోసం అంటావా ?
హిందూ దేవతలంటే, ఎందుకు అంత కక్ష @ysjagan ?
రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నావా ?#JaganPaniAyipoyindhi https://t.co/BfVEa2hY1n pic.twitter.com/kxygrTN2BW— Telugu Desam Party (@JaiTDP) September 28, 2022
తాజావార్తలు
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!