Buggana Rajendranath Reddy: విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ రాజధాని తిరువనంతపురంలో సదరన్ రీజినల్ కౌన్సిల్ భేటీ వాడివేడిగా జరిగింది. విభజన సమస్యలపై సదరన్ రిజీనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన చేశారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ విభజన అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగింది. విభజన సమస్యలు ఇప్పటికీ ఏపీని వెన్నాడుతూనే ఉన్నాయి. విభజన సమస్యల పరిష్కారం.. విభజన హామీల అమలు జరగాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. విభజన జరిగి చాలా కాలం అవుతోన్నా.. ఇప్పటికీ ఆ సమస్యలు పెండింగులోనే ఉన్నాయి.
Read Also:Chinmayi Sripada: సమంతతో నా ప్రయాణం ముగిసింది.. విభేదాలపై క్లారిటీ
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
తిరుపతిలో జరిగిన సదరన్ కౌన్సిల్ మీటింగులో ఏపీకి సంబంధించి ఏడు కీలకాంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హైలెవల్ కమిటీ వేయడం సంతోషంగా వుందన్నారు. ఇందుకు ప్రధాని, హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరింతగా సహకరించాలి. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 25 వేల కోట్లు ఇవ్వాలి. 2014లో రూ. 24350 కోట్ల మేర నిధులను వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలన్న ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పెండింగులో ఉందన్నారు ఆర్థికమంత్రి బుగ్గన.
వెనుకబడిన జిల్లాలకిచ్చే ప్యాకేజీలో భాగంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు కేటాయించాలన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు.. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీలను ఏపీకి ఇవ్వాలని బుగ్గన కోరారు. ఆదాయం సమకూర్చే హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం చొరవ చూపాలి. కేంద్ర వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు సదరన్ కౌన్సిల్ ఛైర్మనుగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
Read Also:CM KCR: మతం పేరుతో చిచ్చు పెట్టే స్వార్థ రాజకీయాల్ని తిప్పికొట్టాలి
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..