Buggana Rajendranath Reddy: విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ రాజధాని తిరువనంతపురంలో సదరన్ రీజినల్ కౌన్సిల్ భేటీ వాడివేడిగా జరిగింది. విభజన సమస్యలపై సదరన్ రిజీనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన చేశారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ విభజన అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగింది. విభజన సమస్యలు ఇప్పటికీ ఏపీని వెన్నాడుతూనే ఉన్నాయి. విభజన సమస్యల పరిష్కారం.. విభజన హామీల అమలు జరగాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. విభజన జరిగి చాలా కాలం అవుతోన్నా.. ఇప్పటికీ ఆ సమస్యలు పెండింగులోనే ఉన్నాయి.
Read Also:Chinmayi Sripada: సమంతతో నా ప్రయాణం ముగిసింది.. విభేదాలపై క్లారిటీ
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
తిరుపతిలో జరిగిన సదరన్ కౌన్సిల్ మీటింగులో ఏపీకి సంబంధించి ఏడు కీలకాంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హైలెవల్ కమిటీ వేయడం సంతోషంగా వుందన్నారు. ఇందుకు ప్రధాని, హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరింతగా సహకరించాలి. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 25 వేల కోట్లు ఇవ్వాలి. 2014లో రూ. 24350 కోట్ల మేర నిధులను వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలన్న ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పెండింగులో ఉందన్నారు ఆర్థికమంత్రి బుగ్గన.
వెనుకబడిన జిల్లాలకిచ్చే ప్యాకేజీలో భాగంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు కేటాయించాలన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు.. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీలను ఏపీకి ఇవ్వాలని బుగ్గన కోరారు. ఆదాయం సమకూర్చే హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం చొరవ చూపాలి. కేంద్ర వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు సదరన్ కౌన్సిల్ ఛైర్మనుగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
Read Also:CM KCR: మతం పేరుతో చిచ్చు పెట్టే స్వార్థ రాజకీయాల్ని తిప్పికొట్టాలి
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!