Buggana Rajendranath Reddy: విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ రాజధాని తిరువనంతపురంలో సదరన్ రీజినల్ కౌన్సిల్ భేటీ వాడివేడిగా జరిగింది. విభజన సమస్యలపై సదరన్ రిజీనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన చేశారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ విభజన అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగింది. విభజన సమస్యలు ఇప్పటికీ ఏపీని వెన్నాడుతూనే ఉన్నాయి. విభజన సమస్యల పరిష్కారం.. విభజన హామీల అమలు జరగాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. విభజన జరిగి చాలా కాలం అవుతోన్నా.. ఇప్పటికీ ఆ సమస్యలు పెండింగులోనే ఉన్నాయి.
Read Also:Chinmayi Sripada: సమంతతో నా ప్రయాణం ముగిసింది.. విభేదాలపై క్లారిటీ
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
తిరుపతిలో జరిగిన సదరన్ కౌన్సిల్ మీటింగులో ఏపీకి సంబంధించి ఏడు కీలకాంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హైలెవల్ కమిటీ వేయడం సంతోషంగా వుందన్నారు. ఇందుకు ప్రధాని, హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరింతగా సహకరించాలి. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 25 వేల కోట్లు ఇవ్వాలి. 2014లో రూ. 24350 కోట్ల మేర నిధులను వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలన్న ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పెండింగులో ఉందన్నారు ఆర్థికమంత్రి బుగ్గన.
వెనుకబడిన జిల్లాలకిచ్చే ప్యాకేజీలో భాగంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు కేటాయించాలన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు.. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీలను ఏపీకి ఇవ్వాలని బుగ్గన కోరారు. ఆదాయం సమకూర్చే హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం చొరవ చూపాలి. కేంద్ర వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు సదరన్ కౌన్సిల్ ఛైర్మనుగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
Read Also:CM KCR: మతం పేరుతో చిచ్చు పెట్టే స్వార్థ రాజకీయాల్ని తిప్పికొట్టాలి
తాజావార్తలు
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?