AP Employees : అధికారుల వివరణ ఏమాత్రం సంతృప్తిగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో డబ్బులపై గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్య నారాయణ మాట్లాడుతూ.. నిన్న అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నెట్ లో ఉంచిన వివరాల మేరకు జీపీఎఫ్ ఖాతాలో 800 కోట్లు విత్ డ్రా అయ్యాయని భావిస్తున్నామని, దీని పై ఆర్ధిక శాఖ అధికారులను నిన్ననే కలిసే ప్రయత్నం చేశామన్నారు. ఈ రోజు దీని పై మరికొంత సమాచారాన్ని సేకరించి లేఖ ద్వారా ఆర్ధిక శాఖ అధికారులకు తెలియజేశామని, అయితే అధికారులు ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తిగా లేదని ఆయన వెల్లడించారు. మా అనుమతి లేకుండా డీఏ సొమ్ము మార్చి నెలలో డెబిట్, క్రెడిట్ ఎంట్రీ కాలేదని, అంతకు ఏడాది ముందు నుండి పడిన సొమ్ము మార్చిలో తీసేశారన్నారు.
ఇది క్రిమినల్ చర్య తీసుకోవాల్సిన అంశం అని అధికారులకు చెప్పామన్నారు. ఇది మా అకౌంట్ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమే అని చెప్పామని, ఇలా చేస్తే వ్యవస్థలపై ఉద్యోగి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం వుందని ఆయన స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వద్దకు వెళ్ళి మొత్తం వ్యవహరం పై ఫిర్యాదు చేస్తామని, గతేడాది మాదిరిగానే ఈ ఏడాది మా అకౌంట్ లో సొమ్ము పోయిందని ఆయన ఆరోపించారు. గత ఏడాది అకౌంట్ లోనుండి తీసుకున్న మొత్తం చాలా మందికి రాలేదు, ఇప్పుడు మళ్లీ అదే జరిగనుంది అనే అనుమానం ఉందని, సీఎఫ్ఎంఎస్ రాజ్యాంగ విరుద్ధం అని భావిస్తున్నామన్నారు. దానికి వున్న చట్టబద్దత ఏంటి? సీఎఫ్ఎంఎస్లో ఉండి తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?