EC : ఏపీలో కొత్త ఈవీఎంలు.. ఒక్క ఫేజ్లో వాడిన ఈవీఎం మరొక ఫేజ్లో.!
- AP లో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంల కొనుగోలు ఆలోచన
- ECIL ఇంజనీర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం
- ఒకే ఈవీఎం ను వేర్వేరు ఫేజ్లలో వినియోగించే సౌలభ్యం
- ప్రతీ పోలింగ్ స్టేషన్కి అవసరమైన కంట్రోల్, బ్యాలెట్ యూనిట్ల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC : రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్ను వివిధ ఫేజ్లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు. ఈరోజు ఆలోచనపై ECIL ఇంజనీర్లు, ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని కలిసి చర్చించారు. ఇప్పటికే ECIL సాధారణ ఎన్నికలకు M-1, M-2, M-3 మోడల్స్ అందించగా, కొత్త S-3 మోడల్ ద్వారా మెమోరీ డ్రైవ్ ఉపయోగించి వెంటనే మరొక ప్రాంతంలో కూడా వినియోగించవచ్చు.
Sai Dharam Tej : ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి సాలిడ్ అప్డేట్..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ప్రతీ ఫేజ్లో 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని అంచనా. ఒక కంట్రోల్ యూనిట్కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయడం సాధ్యమని అధికారులు తెలిపారు. 1,37,671 పోలింగ్ స్టేషన్లలో 4 ఫేజ్లలో స్ధానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై సిఫార్సు కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతిరాజ్ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. స్ధానిక ఎన్నికల ఏర్పాట్ల గురించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుండి కూడా ఈవీఎంలను తీసుకోవచ్చని సూచన చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో స్ధానిక ఎన్నికలలో ఇప్పటికే ఈవీఎంల వినియోగం కొనసాగుతోంది.
ఎలక్షన్ కమిషన్ సూచనాత్మకంగా జనవరి నుండి ఎన్నికలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజాప్రతినిధ్య చట్టం 1950 ప్రకారం అర్హతను నిర్ణయించేందుకు ప్రత్యేక తేది సూచించాలని సూచించింది. ఆన్లైన్ నామినేషన్లు అందించినా, ఫిజికల్గా సమర్పించాల్సిన అవసరం ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో మాత్రమే ఈవీఎంల వినియోగంపై డెమో నిర్వహించగా, ప్రభుత్వానికి తుది నిర్ణయం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల విజయవంతమైన నిర్వహణ కోసం కొత్త ఈవీఎంలు కీలకమైన పాయింట్గా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!