EC : ఏపీలో కొత్త ఈవీఎంలు.. ఒక్క ఫేజ్లో వాడిన ఈవీఎం మరొక ఫేజ్లో.!
- AP లో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంల కొనుగోలు ఆలోచన
- ECIL ఇంజనీర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం
- ఒకే ఈవీఎం ను వేర్వేరు ఫేజ్లలో వినియోగించే సౌలభ్యం
- ప్రతీ పోలింగ్ స్టేషన్కి అవసరమైన కంట్రోల్, బ్యాలెట్ యూనిట్ల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC : రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్ను వివిధ ఫేజ్లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు. ఈరోజు ఆలోచనపై ECIL ఇంజనీర్లు, ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని కలిసి చర్చించారు. ఇప్పటికే ECIL సాధారణ ఎన్నికలకు M-1, M-2, M-3 మోడల్స్ అందించగా, కొత్త S-3 మోడల్ ద్వారా మెమోరీ డ్రైవ్ ఉపయోగించి వెంటనే మరొక ప్రాంతంలో కూడా వినియోగించవచ్చు.
Sai Dharam Tej : ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి సాలిడ్ అప్డేట్..
Also Read
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
ప్రతీ ఫేజ్లో 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని అంచనా. ఒక కంట్రోల్ యూనిట్కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయడం సాధ్యమని అధికారులు తెలిపారు. 1,37,671 పోలింగ్ స్టేషన్లలో 4 ఫేజ్లలో స్ధానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై సిఫార్సు కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతిరాజ్ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. స్ధానిక ఎన్నికల ఏర్పాట్ల గురించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుండి కూడా ఈవీఎంలను తీసుకోవచ్చని సూచన చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో స్ధానిక ఎన్నికలలో ఇప్పటికే ఈవీఎంల వినియోగం కొనసాగుతోంది.
ఎలక్షన్ కమిషన్ సూచనాత్మకంగా జనవరి నుండి ఎన్నికలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజాప్రతినిధ్య చట్టం 1950 ప్రకారం అర్హతను నిర్ణయించేందుకు ప్రత్యేక తేది సూచించాలని సూచించింది. ఆన్లైన్ నామినేషన్లు అందించినా, ఫిజికల్గా సమర్పించాల్సిన అవసరం ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో మాత్రమే ఈవీఎంల వినియోగంపై డెమో నిర్వహించగా, ప్రభుత్వానికి తుది నిర్ణయం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల విజయవంతమైన నిర్వహణ కోసం కొత్త ఈవీఎంలు కీలకమైన పాయింట్గా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!