EC : ఏపీలో కొత్త ఈవీఎంలు.. ఒక్క ఫేజ్లో వాడిన ఈవీఎం మరొక ఫేజ్లో.!
- AP లో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంల కొనుగోలు ఆలోచన
- ECIL ఇంజనీర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం
- ఒకే ఈవీఎం ను వేర్వేరు ఫేజ్లలో వినియోగించే సౌలభ్యం
- ప్రతీ పోలింగ్ స్టేషన్కి అవసరమైన కంట్రోల్, బ్యాలెట్ యూనిట్ల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC : రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్ను వివిధ ఫేజ్లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు. ఈరోజు ఆలోచనపై ECIL ఇంజనీర్లు, ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని కలిసి చర్చించారు. ఇప్పటికే ECIL సాధారణ ఎన్నికలకు M-1, M-2, M-3 మోడల్స్ అందించగా, కొత్త S-3 మోడల్ ద్వారా మెమోరీ డ్రైవ్ ఉపయోగించి వెంటనే మరొక ప్రాంతంలో కూడా వినియోగించవచ్చు.
Sai Dharam Tej : ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి సాలిడ్ అప్డేట్..
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ప్రతీ ఫేజ్లో 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని అంచనా. ఒక కంట్రోల్ యూనిట్కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయడం సాధ్యమని అధికారులు తెలిపారు. 1,37,671 పోలింగ్ స్టేషన్లలో 4 ఫేజ్లలో స్ధానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై సిఫార్సు కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతిరాజ్ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. స్ధానిక ఎన్నికల ఏర్పాట్ల గురించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుండి కూడా ఈవీఎంలను తీసుకోవచ్చని సూచన చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో స్ధానిక ఎన్నికలలో ఇప్పటికే ఈవీఎంల వినియోగం కొనసాగుతోంది.
ఎలక్షన్ కమిషన్ సూచనాత్మకంగా జనవరి నుండి ఎన్నికలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజాప్రతినిధ్య చట్టం 1950 ప్రకారం అర్హతను నిర్ణయించేందుకు ప్రత్యేక తేది సూచించాలని సూచించింది. ఆన్లైన్ నామినేషన్లు అందించినా, ఫిజికల్గా సమర్పించాల్సిన అవసరం ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో మాత్రమే ఈవీఎంల వినియోగంపై డెమో నిర్వహించగా, ప్రభుత్వానికి తుది నిర్ణయం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల విజయవంతమైన నిర్వహణ కోసం కొత్త ఈవీఎంలు కీలకమైన పాయింట్గా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!