ఏపీకి వచ్చే వారికి అలర్ట్ : ఈ రూల్స్ పాటించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు రాష్ట్రాలలో ఈ పాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు విధించిన నిబంధనలను ప్రజలు అర్థం చేసుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ-పాస్ లేకుండా ప్రయాణించడం ద్వారా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని డీజీపీ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పొరుగు రాష్ట్రాలలో అమలవుతున్న ఈపాస్ నిబంధనలను పరిశీలించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
A) ఇతర రాష్ట్రాల నుండి ఏపీ కి రావాలనుకొంటే:
ఆంద్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలనుకొనే వారు, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉదయం 6 గంటల నుండి 12:00 గంటల మధ్యనే ప్రయాణించేలా, ఆ లోపే తమ గమ్యానికి చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే అట్టి వారికి ఎలాంటి పాస్ లు అవసరం లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయంలో ప్రయాణించదలిస్తే ఈపాస్ కచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఉదయం పన్నెండు తర్వాత బోర్డర్ దాటి ఏపీ భూభాగం లోకి ప్రవేశించాలనుకునే వారు లేదా ఆంద్రప్రదేశ్ భూభాగం లో 12 గంటల తర్వాత ప్రయాణించాలనుకొనే వారికి ఈపాస్ అవసరం. ప్రభుత్వం G.Oలో పేర్కొన్న మినహాయింపు సేవలు అనగా అత్యవసర సేవలు, అంబులెన్స్ తదితర సేవలు మరియు సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదు.
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
B)రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే:
ఏపీలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ఉదయం 6 గంటల నుండి 12:00 గంటల మధ్యనే ప్రయాణించేలా, ఆ లోపే తమ గమ్యాన్ని చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే అట్టి వారికి కూడా ఎలాంటి ఈపాస్ లు అవసరం లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయంలో ప్రయాణించదలిస్తే మాత్రం ఈపాస్ కచ్చితంగా అవసరం ఉంటుంది.అట్టి వారు తప్పనిసరిగా పూర్తి దృవ పత్రాలతో ఈ-పాస్ కు అప్లై చేసి ఈపాస్ పొందగలరు. ప్రభుత్వం G.O లో పేర్కొన్న మినహాయింపు సేవలు మరియు సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదు.
C) ఈ పాస్ లింక్ పొందడం ఎలా?:
ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి తప్పనిసరిగా సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్ (@APPOLICE100,ఫేస్ బుక్ (@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చు.
D) తెలంగాణాలోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
తెలంగాణాలో ఉదయం 6 నుండి 10 వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణా భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు https://policeportal.tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ-పాస్ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది.
E) తమిళనాడు లోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
తమిళనాడు లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. తమిళనాడు భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు (https://eregister.tnega.org/)
ద్వారా తమిళనాడు ఈ-పాస్ పొందవచ్చు.
F) ఒరిస్సా రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
ఒరిస్సా లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. ఒరిస్సా భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు (https://covid19regd.odisha.gov.in/) అనే లింక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చు.
G) కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే:
కర్ణాటక లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్రంలో ఈపాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్నాటక లోకి కూడా పాస్ ఇవ్వబడును. కానీ కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూభాగం లోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుందన్న విషయాన్ని గమనించగలరు.
H) శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి.
- Tags
- ap
- Covid19
- dgp savang
- strict rules
తాజావార్తలు
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!