YS Jagan Mohan Reddy: మోటార్లకు మీటర్లపై సీఎం సమీక్ష.. చాలా విద్యుత్ ఆదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్ల ద్వారా చాలా విద్యుత్ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయనకు.. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని వివరించారు విద్యుత్శాఖ అధికారులు.. విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్ ఎస్ఎల్డీసీలో ఏర్పాటు చేశారు.. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.. కచ్చితమైన డిమాండ్ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం కీలకంగా మారింది.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కీలక సూచలన చేశారు.. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని.. విదేశీ బొగ్గు ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు.. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని.. సులియారీ, మహానది కోల్బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ఇక, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.. అయితే, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం.. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆయన.. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్నారు.. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుంది.. దీని వల్ల సరిపడా విద్యుత్ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది.. దీని వల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవన్నారు.. రైతులకు ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి.. వినియోగించుకున్న విద్యుత్కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారని.. అక్కడ నుంచి ఆ డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుందని.. దీని వల్ల రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది.. దీని వల్ల చాలా విద్యుత్ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్ జగన్.
మరోవైపు.. ఈ సమావేశంలో.. పోలవరం విద్యుత్ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని సీఎం వైఎస్ జగన్కు వివరించిన అధికారులు.. ఇప్పటికే టర్బైన్ మోడల్ టెస్ట్ ముగిసిందని, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు… పవర్ హౌస్లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.. అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పూర్తయ్యిందని సీఎంకు వివరించారు.. టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!