Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Ys Jagan Disburses Fee Reimbursement Under Jagananna Vidya Deevena

YS Jagan: 10.82 లక్షల మంది ఖాతాల్లోకి నగదు బదిలీ చేసిన సీఎం..

Published Date :March 16, 2022 , 12:01 pm
By Sudhakar Ravula
YS Jagan: 10.82 లక్షల మంది ఖాతాల్లోకి నగదు బదిలీ చేసిన సీఎం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

జగనన్న విద్యాదీవెన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి విద్యాదీవెన కార్యక్రమం కింద విద్యార్థుల తల్లుల అక్కౌంట్లకు నగదు బదిలీ చేశారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 10.82 లక్షల మంది విద్యార్ధులకు అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి రూ.709 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలలోకి జమ చేసినట్టు వెల్లడించారు.. 100 శాతం లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయో గమనించాలన్న యాన.. విద్య ఉన్న కుటుంబాలకు, విద్య లేని కుటుంబాలకు చాలా తేడా ఉంటుంది.. చదువుకు పేదరికం అడ్డు రాకూడదు.. ఫీజు రియింబర్స్‌ మెంట్‌మీద ఎప్పుడు మాట్లాడినా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన నా కళ్లముందు కనిపిస్తూ ఉంటుందన్నారు.. చదువులు కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదన్న ఏపీ సీఎం.. ఈ విషయాలను గట్టిగా నమ్మిన వ్యక్తి నాన్నగారని గుర్తుచేస్తున్నారు.

Read Also: Telangana: విషాదం.. ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌ గన్‌ పేలి బాలిక మృతి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలకోసం గతంలో నాయకులు కేవలం మాటలు మాత్రమే చెప్పేవారు.. కానీ, నాన్న (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి)గారు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ తీసుకు వచ్చారని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. తర్వాత వచ్చిన వారు అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉండేదని.. మొత్తం స్కీంను నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు స్కీమ్‌ను మనం వచ్చాక బాగా మార్పు చేశాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన వారందరికీ కూడా పూర్తి ఫీజురియింబర్స్‌ మెంట్‌ అమలు చేస్తున్నాం అన్నారు. ఎలాంటి అరియర్స్‌ లేకుండా.. ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తున్నాం.. బోర్డింగ్‌ ఖర్చులు కూడా వసతి దీవెన కింద ఇస్తున్నామన్న ఆయన.. విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్‌ మెంట్‌ ఎలా ఉందని ఆలోచన చేయండి.. ఏ స్థాయిలో ఫీజులున్నా.. ఇచ్చేది కేవలం రూ.35వేలు అని ఎద్దేవా చేశారు.. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి రూ.1770 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి వెళ్లారని మండిపడ్డ ఆయన.. అయినా పిల్లలకోసం వాటిని కూడా చెల్లించామని.. విద్యాదీవెన, వసతి దీవెనల కోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.9,274 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు.. ఈ డబ్బులు ఇవ్వడమే కాకుండా మొదటసారిగా తల్లులఖాతాల్లోకి వేస్తున్నాం.. తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశాం.. మరో త్రైమాసికం రాకముందే.. చెల్లిస్తున్నాం.. ఎక్కడా ఇబ్బంది పడకుండా డబ్బులు ఇస్తున్నట్టు తెలిపారు.

తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం మొదలుపెడితే… కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు సీఎం వైఎస్‌ జగన్.. అందుకే ఆ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం.. వసతి దీవెన డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం, రెండో విడత వసతి దీవెన ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించండి.. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తాం.. పూర్తిగా వసతి దీవెన ఇస్తాం, పిల్లలు బాగా చదివితేనే వారు పోటీప్రపంచంలో నిలబడగలరు అన్నారు.. పిల్లలకు మంచి మేనమామగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షలమంది ప్రైవేటునుంచి వచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్న సీఎం.. ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • CM YS Jagan
  • Jagananna Vidya Deevena

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions