CM Jagan Mohan Reddy: పోలవరం నిర్వాసితులకు కేంద్రం పరిహారం ఇవ్వకుంటే నేనే ఇస్తా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు విని, పరిష్కరించేందుకే తాను వచ్చానని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నానని తెలిపారు. రూ.వెయ్యి, రెండు వేల కోట్లు అయితే తాను భరించేవాడిని అని.. కానీ రూ.20 వేల కోట్లు కావాలని,,. అందుకే ప్రతిసారీ కేంద్రాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు. కేంద్రం పరిహారం ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తానే ఇస్తానని.. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు త్వరగా కట్టిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
Read Also: Srikakulam YCP Politics : శ్రీకాకుళం వైసీపీలో వాడీ వేడిగా గ్రూపు రాజకీయాలు
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఎవరికి ఎలాంటి వరద నష్టం జరిగినా గ్రామ సచివాలయంలో లిస్ట్లో ఉంటుందని సీఎం జగన్ అన్నారు. వరద నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని జగన్ స్పష్టం చేశారు. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని జగన్ తెలిపారు. వరద బాధితులకు పారదర్శకంగా పరిహారం అందించామని.. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించామని వివరించారు. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చామని సీఎం జగన్ చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!