CM Jagan: ఈనెల 22న కుప్పంలో జగన్ పర్యటన.. రూ.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో గెలవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 22న కుప్పంలో పర్యటించి రూ.66 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా భారీ జనసమీకరణ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు స్వయంగా సీఎం జగన్ పర్యటిస్తుండటంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీకి ఆస్కారం లభించే అవకాశముంది.
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
కాగా సీఎం జగన్ పాల్గొనే అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు సమాచారం ఇవ్వనున్నారు. సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదు. అయితే 2024లో జరిగే కుప్పం ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జగన్కు పోటీగా అదే సమయంలో చంద్రబాబు కూడా పర్యటిస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో రభస చోటు చేసుకుంది. వైసీపీ నేతలు అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేశారంటూ చంద్రబాబు రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఏదేమైనా సీఎం జగన్ కుప్పం పర్యటన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుండగా టీడీపీలో మాత్రం గుబులు రేపుతోంది.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!