CM Jagan: ఈనెల 22న కుప్పంలో జగన్ పర్యటన.. రూ.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో గెలవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 22న కుప్పంలో పర్యటించి రూ.66 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా భారీ జనసమీకరణ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు స్వయంగా సీఎం జగన్ పర్యటిస్తుండటంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీకి ఆస్కారం లభించే అవకాశముంది.
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
కాగా సీఎం జగన్ పాల్గొనే అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు సమాచారం ఇవ్వనున్నారు. సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదు. అయితే 2024లో జరిగే కుప్పం ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జగన్కు పోటీగా అదే సమయంలో చంద్రబాబు కూడా పర్యటిస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో రభస చోటు చేసుకుంది. వైసీపీ నేతలు అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేశారంటూ చంద్రబాబు రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఏదేమైనా సీఎం జగన్ కుప్పం పర్యటన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుండగా టీడీపీలో మాత్రం గుబులు రేపుతోంది.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!