NTV Telugu Site icon

CM Chandrababu: కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..

Babu Modi

Babu Modi

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన 15 వేల కోట్ల రూపాయలు త్వరగా అందేలా చూడాలని ప్రధానినీ ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీకానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు.

Read Also: Bangladesh: బంగ్లాలో మారని పరిస్థితులు.. నటి రోకెయా ప్రాచీపై మూకదాడి..

కాగా, ఈ రోజు రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరనున్నారు. అయితే, అంతకు ముందు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులా నిర్మాణానికి కావాల్సిన పనులపై చర్చించారు.