ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354 కి చేరింది. ఇందులో 18,42,432 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 38 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,744 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3963 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 90,574 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.