Somu Veerraju : కేంద్రం ఇచ్చే పథకాలను.. తమ సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారు..
Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గృహానిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం నిధులను వైసీపీ కార్యకర్తలు పక్కదారి పట్టించడం తప్ప, రాష్ట్ర అభివృద్ధిలో వారికి సంబంధం లేదు అని సోము వీర్రాజు అన్నారు.
Also Read : Minister Kakani : వాళ్లు ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పుతున్నారు..
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దెబ్బతీసిన సీఎం జగన్ పై ప్రజా ఛార్జ్ షీట్ వేస్తున్నాము అంటూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తిచేయలేని ప్రభుత్వమిది అని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ మాత్రం తన ఫోటోలు వేసుకుంటున్నాడు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం వైసీపీ సర్కార్ ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టలేని పరిస్థితి వచ్చిందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించానని సోము వీర్రాజు తెలిపారు. వారి నిర్ణయం తర్వాత బీజేపీ స్ట్రాటజీని ఫాలో అవుతామని ఏపీ బీజేపీ చీఫ్ అన్నారు.
Also Read : Delhi: భార్యా పిల్లలను కడతేర్చిన కసాయి.. చివరకు ఇంటర్నెట్లో చదివి భర్త ఆత్మహత్య..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!