కేసీఆర్, జగన్ది మూడు ముక్కలాట.. రాత్రి ఫోన్లు.. పగలు ఉత్తరాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని, కృష్ణ జలాలను ఒప్పందం ప్రకారం పంచుకుంటామని కేసీఆర్ అన్నారని.. కానీ, ఆ మాటను కేసీఆర్ మర్చిపోయారా? గుర్తు చేయడానికి జగన్ సిగ్గుపడుతున్నారా..? అని ప్రశ్నించారు.
కృష్ణ జలాలపై సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. తెలంగాణ విషయంలో మాట్లాడబోమని సజ్జల ఎందుకు అంటున్నారు? అని నిలదీసిన ఆయన.. విభజన సమయంలో ఏపీకి చాలా నష్టం జరిగింది.. రాజధాని నష్టపోయాం, భద్రచలం వదులుకున్నాం.. ఆదాయం కోల్పోయామన్నారు.. సోనియాగాంధీ కాళ్లు పట్టుకొని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలను కేసీఆర్ తెలంగాణలో కలుపుకున్నారన్న ఆయన.. ఏపీకి నష్టం జరుగుతున్నా జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు.. ఇక, ఏపీకి అన్యాయం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోంది.. చుక్క నీరు వదులుకోమని ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. జగన్, కేసీఆర్ తెలివిగా ఉత్తరాలు రాసుకుంటున్నారని విమర్శించిన ఆయన.. కేఆర్ఎంబీ ముందు వాదనలు వినిపించకుండా మాట్లాడమంటే ఎలా…? అని ప్రశ్నించారు. మరోవైపు వివాదాలు లేని పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో వున్నాయి… అవి ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు.. ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బీజేపీ ఉద్యమం చేస్తుందని.. త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు సోము వీర్రాజు.
Also Read
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?