Ap Assembly: ప్రభుత్వ పథకాలతో సమగ్రాభివృద్ధి:గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైయస్ఆర్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన వృద్ధి. పాలన కింద స్థాయికి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి.మన బడి నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.తొలి దశలలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలలను అభివృద్ధి చేశాం.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
44.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.13,023 కోట్లు అందజేశాం.జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ.కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించాం.శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు.రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13, 500 చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు రూ.20,162 కోట్ల సాయం.
9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం.2021-22లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం చేకూర్చాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,04,758 గా ఉంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందించాం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు సాయం. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులకు రూ.583 కోట్లు సాయం. 2.7 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.770 కోట్ల సాయం. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం.
వైఎస్ఆర్ ఆసరా కింద 78.75 లక్షల మందికి సాయం. స్వయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు అందించాం.వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.75వేల చొప్పున సాయం.కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ.981.88 కోట్లు అందించాం.ఈబీసీ నేస్తం కింద ఏడాదికి అర్హులైన ఒక్కొక్కరికీ రూ.15వేల సాయం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్ల సాయం.
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం.వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.2,354 కోట్లు అందించాం.వైఎస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9100 కోట్లు.పాలన కింది స్థాయి వరకు వెళ్లేందుకు గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి.విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి.రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చేయూత.
దేశ జీడీపీ 7.3 శాతం తగ్గింది.2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82శాతం సమగ్రాభివృద్ధి సాధిస్తుంది.గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లు వ్యయం.3 వేల కి.మీ పొడవైన 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి.2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు.వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మకమైన మౌలిక సదుపాయాలు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి.
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!