Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Assembly Budget Session Governors Speech

Ap Assembly: ప్రభుత్వ పథకాలతో సమగ్రాభివృద్ధి:గవర్నర్

Published Date :March 7, 2022 , 12:53 pm
By NTV WebDesk
Ap Assembly: ప్రభుత్వ పథకాలతో సమగ్రాభివృద్ధి:గవర్నర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన వృద్ధి. పాలన కింద స్థాయికి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి.మన బడి నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.తొలి దశలలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలలను అభివృద్ధి చేశాం.

44.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.13,023 కోట్లు అందజేశాం.జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ.కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించాం.శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు.రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13, 500 చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు రూ.20,162 కోట్ల సాయం.

9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం.2021-22లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం చేకూర్చాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,04,758 గా ఉంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందించాం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు సాయం. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులకు రూ.583 కోట్లు సాయం. 2.7 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.770 కోట్ల సాయం. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం.

వైఎస్ఆర్ ఆసరా కింద 78.75 లక్షల మందికి సాయం. స్వయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు అందించాం.వైఎస్ఆర్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.75వేల చొప్పున సాయం.కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ.981.88 కోట్లు అందించాం.ఈబీసీ నేస్తం కింద ఏడాదికి అర్హులైన ఒక్కొక్కరికీ రూ.15వేల సాయం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్ల సాయం.

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం.వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.2,354 కోట్లు అందించాం.వైఎస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9100 కోట్లు.పాలన కింది స్థాయి వరకు వెళ్లేందుకు గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి.విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి.రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చేయూత.

దేశ జీడీపీ 7.3 శాతం తగ్గింది.2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82శాతం సమగ్రాభివృద్ధి సాధిస్తుంది.గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లు వ్యయం.3 వేల కి.మీ పొడవైన 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి.2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు.వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మకమైన మౌలిక సదుపాయాలు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Assembly
  • Budget session
  • cm jagan
  • corona effect
  • development

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions