AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మారుతున్న వాతావరణం
- పిడుగులతో వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- మరోవైపు వడగాల్పుల ముప్పు కొనసాగుతూనే..!
- కర్నూలులో 42.9°C.. ఎండలతో అల్లాడుతున్న ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు నుండి రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి.
Also Read
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- Ambati Rambabu: 'ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు'.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
ద్రోణి ప్రభావంతో రేపు (బుధవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో వర్ష సూచన ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. రేపు అల్లూరి జిల్లాలోని జీకేవీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లోనూ.. అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం , గుర్తేడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నేడు నమోదైన గణాంకాల ప్రకారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత రికార్డైంది. ఇతర ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి:
నంద్యాల (కొత్తపల్లి): 42.4°C
పోలవరం (ఎర్రంపేట): 42°C
ప్రకాశం (కొప్పెరపాడు): 41.9°C
మర్కాపురం (కంభం): 41.7°C
పల్నాడు (గురజాల): 41.3°C
అనంతపురం, కడప ప్రాంతాల్లో: 41.1°C
వాతావరణం అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!