AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మారుతున్న వాతావరణం
- పిడుగులతో వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- మరోవైపు వడగాల్పుల ముప్పు కొనసాగుతూనే..!
- కర్నూలులో 42.9°C.. ఎండలతో అల్లాడుతున్న ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు నుండి రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి.
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
ద్రోణి ప్రభావంతో రేపు (బుధవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో వర్ష సూచన ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. రేపు అల్లూరి జిల్లాలోని జీకేవీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లోనూ.. అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం , గుర్తేడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నేడు నమోదైన గణాంకాల ప్రకారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత రికార్డైంది. ఇతర ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి:
నంద్యాల (కొత్తపల్లి): 42.4°C
పోలవరం (ఎర్రంపేట): 42°C
ప్రకాశం (కొప్పెరపాడు): 41.9°C
మర్కాపురం (కంభం): 41.7°C
పల్నాడు (గురజాల): 41.3°C
అనంతపురం, కడప ప్రాంతాల్లో: 41.1°C
వాతావరణం అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..