AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మారుతున్న వాతావరణం
- పిడుగులతో వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- మరోవైపు వడగాల్పుల ముప్పు కొనసాగుతూనే..!
- కర్నూలులో 42.9°C.. ఎండలతో అల్లాడుతున్న ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు నుండి రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి.
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
ద్రోణి ప్రభావంతో రేపు (బుధవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో వర్ష సూచన ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. రేపు అల్లూరి జిల్లాలోని జీకేవీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లోనూ.. అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం , గుర్తేడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నేడు నమోదైన గణాంకాల ప్రకారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత రికార్డైంది. ఇతర ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి:
నంద్యాల (కొత్తపల్లి): 42.4°C
పోలవరం (ఎర్రంపేట): 42°C
ప్రకాశం (కొప్పెరపాడు): 41.9°C
మర్కాపురం (కంభం): 41.7°C
పల్నాడు (గురజాల): 41.3°C
అనంతపురం, కడప ప్రాంతాల్లో: 41.1°C
వాతావరణం అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.
తాజావార్తలు
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
-
Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
-
India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
-
Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
-
Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!