CM Chandrababu: భారతదేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం..
- సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఆదర్శప్రాయం..
- నేను నిత్య విద్యార్థిని, ప్రతిరోజూ కొత్త విషయం నేర్చుకుంటాను..
- ఐఐటీపై నేను తీసుకున్న చర్యలతో తెలుగువారు ఎక్కువ సీట్లు సాధించారు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అమరావతిలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 అంటే ప్రతి ఒక్కరికీ టీచర్స్ డే గుర్తుకొస్తుందని అన్నారు. నేను సీఎం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతున్నాను.. భారతదేశ చరిత్రలో తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది ఉపాధ్యాయులనే.. జీవితంలో ఎవర్ని మర్చిపోయినా, చదువు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం మర్చిపోలేం.. పిల్లలకు విద్యను అందించడమే కాకుండా, వారిలో స్ఫూర్తిని నింపేది టీచర్లేనని గుర్తు చేశారు. చిన్నతనంలో తనకు బోధించిన ఉపాధ్యాయుడు భక్తవత్సలం గారు ఇప్పటికీ గుర్తుంటారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Ajinkya Rahane: టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్గా మారతాడు.. ఆసియా కప్ మనదే!
Also Read
అయితే, గత ఏడాది బుడమేరు వరదల కారణంగా గురుపూజోత్సవం జరుపుకోలేకపోయామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి 175 మంది ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, సలహాలతో వారి ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ముద్రిస్తామని తెలిపారు. ఇక, చిత్తూరు రేణిగుంట పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసి.. భారత రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు.. వివేకాన్ని, విమర్శన శక్తిని పెంపొందించాలని వెల్లడించారు. అక్షరజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
ఇక, రాజకీయ నాయకుల పిల్లలు సాధారణంగా చదువుకోరు.. గారాబంతో పిచ్చి అలవాట్లకు గురౌతారని సీఎ చంద్రబాబు అన్నారు. కానీ నారా లోకేష్ ఈ స్థితికి రావడంలో ఆయన తల్లి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. చుక్కా రామయ్య లాంటి వారు విద్య కోసం ఎన్నో ఒత్తిడులను తట్టుకుని నిలబడ్డారు.. బిట్స్ పిలాని వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఎక్కువగా ఎంపికవుతున్నారని చెప్పుకొచ్చారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఐటీని బలంగా ప్రమోట్ చేశాను.. పిల్లలకు ఇచ్చే ఆస్తుల కంటే చదువు అందిస్తే ఊహించని స్థాయికి ఎదుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆదాయం సంపాదిస్తున్న వారిలో భారతీయులు ఎక్కువ. అందులో 33 శాతం తెలుగువారే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!