CM Chandrababu: భారతదేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం..
- సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఆదర్శప్రాయం..
- నేను నిత్య విద్యార్థిని, ప్రతిరోజూ కొత్త విషయం నేర్చుకుంటాను..
- ఐఐటీపై నేను తీసుకున్న చర్యలతో తెలుగువారు ఎక్కువ సీట్లు సాధించారు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అమరావతిలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 అంటే ప్రతి ఒక్కరికీ టీచర్స్ డే గుర్తుకొస్తుందని అన్నారు. నేను సీఎం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతున్నాను.. భారతదేశ చరిత్రలో తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది ఉపాధ్యాయులనే.. జీవితంలో ఎవర్ని మర్చిపోయినా, చదువు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం మర్చిపోలేం.. పిల్లలకు విద్యను అందించడమే కాకుండా, వారిలో స్ఫూర్తిని నింపేది టీచర్లేనని గుర్తు చేశారు. చిన్నతనంలో తనకు బోధించిన ఉపాధ్యాయుడు భక్తవత్సలం గారు ఇప్పటికీ గుర్తుంటారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Ajinkya Rahane: టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్గా మారతాడు.. ఆసియా కప్ మనదే!
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అయితే, గత ఏడాది బుడమేరు వరదల కారణంగా గురుపూజోత్సవం జరుపుకోలేకపోయామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి 175 మంది ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, సలహాలతో వారి ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ముద్రిస్తామని తెలిపారు. ఇక, చిత్తూరు రేణిగుంట పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసి.. భారత రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు.. వివేకాన్ని, విమర్శన శక్తిని పెంపొందించాలని వెల్లడించారు. అక్షరజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
ఇక, రాజకీయ నాయకుల పిల్లలు సాధారణంగా చదువుకోరు.. గారాబంతో పిచ్చి అలవాట్లకు గురౌతారని సీఎ చంద్రబాబు అన్నారు. కానీ నారా లోకేష్ ఈ స్థితికి రావడంలో ఆయన తల్లి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. చుక్కా రామయ్య లాంటి వారు విద్య కోసం ఎన్నో ఒత్తిడులను తట్టుకుని నిలబడ్డారు.. బిట్స్ పిలాని వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఎక్కువగా ఎంపికవుతున్నారని చెప్పుకొచ్చారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఐటీని బలంగా ప్రమోట్ చేశాను.. పిల్లలకు ఇచ్చే ఆస్తుల కంటే చదువు అందిస్తే ఊహించని స్థాయికి ఎదుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆదాయం సంపాదిస్తున్న వారిలో భారతీయులు ఎక్కువ. అందులో 33 శాతం తెలుగువారే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!